News June 15, 2024
రామోజీ విగ్రహం ఏర్పాటుకు సన్నాహం: ఎంపీ కలిశెట్టి

భావితరాలకు గుర్తుండిపోయేలా రామోజీరావు నిలువెత్తు విగ్రహాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రతిష్టించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వెల్లడించారు. ఇందుకు సంబంధించి శుక్రవారం రణస్థలంలోని ఎంపీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. కోనసీమ జిల్లా కొత్తపేటలో ఉన్న శిల్పి వద్దకు వెళ్లి రామోజీ నిలువెత్తు విగ్రహాన్ని రూపొందించేందుకు కలిశెట్టి సన్నద్ధం చేశారు.
Similar News
News January 21, 2026
చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి జాతర తేదీలు ఖరారు..

చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర తేదీలు ఖరారయ్యాయి. జాతర వివరాలు..
➱ఫిబ్రవరి 22న (ఆదివారం) జాతర ప్రారంభం
➱23న (సోమవారం) పసుపు, కుంకుమ ముర్రాటలతో మొక్కుబడులు చెల్లింపులు
➱24న మంగళవారం రాత్రి గుడిలోకి ఘటాలు రావడంతో జాతర ముగుస్తుంది.
వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
News January 21, 2026
ఆపదలో ఉన్నాం.. డబ్బులు పంపించండి అంటూ కాల్స్: VZM ఎస్పీ

ఆపదలో ఉన్నామని చెప్పి ఫోన్ చేసి డబ్బులు వసూలు చేసే కొత్త తరహా మోసాలు పెరుగుతున్నాయని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. ప్రయాణంలో బ్యాగులు పోయాయని, మహిళలు, పిల్లల పేరుతో సహాయం కోరుతూ ఫోన్పే, గూగుల్పే స్కానర్లు పంపి మోసం చేస్తున్నారని ఆయన బుధవారం తెలిపారు. ఇలాంటి కాల్స్ వస్తే డబ్బులు పంపేముందు తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని, అనుమానం ఉంటే వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించాలని జిల్లా ప్రజలకు సూచించారు.
News January 21, 2026
ప్రజలకు కావాల్సింది దావోస్లు కాదు.. కష్టాలు తీరాలి: బొత్స

రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమేనని, కానీ ప్రజలకు అవసరమైనది విదేశీ దావోస్ సమావేశాలు కాదని, సామాన్యుల కష్టాలు తీరే పాలన కావాలని YCP నేత బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ పథకం కింద ఆర్గనైజ్డ్గా దొంగ మస్టర్లు వేసి రూ.కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పూర్తిగా నాశనమవుతోందని, ప్రజల మీద, ప్రజా ప్రతినిధుల మీద పోలీసుల అరాచకమా అని ప్రశ్నించారు.


