News June 15, 2024
కాకినాడ: ఏడాకుల చెట్లు తొలగించాలని మంత్రికి లేఖ
రాష్ట్రంలో పర్యావరణానికి హానికరంగా ఉన్న కోనోకార్పస్, ఏడాకుల చెట్లను తొలగించి వేప మొక్కలు నాటించాలని పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్కు పౌర సంక్షేమ సంఘం శనివారం రిజిస్టర్డ్ లేఖ పంపింది. రోగ నిరోధక శక్తి తగ్గిన వారికి ఏడాకుల చెట్ల వలన తీవ్ర అనారోగ్యం కలిగే అవకాశం ఉందని అందులో పేర్కొంది. కాకినాడ నగరంలో 35 వేల కోనోకార్పస్ వృక్షాలు, 150 ఏడాకుల చెట్లు ఉన్నాయన్నారు.
Similar News
News October 2, 2024
ఎన్నికల హామీలకు తూట్లు పొడుస్తున్నారు: మాజీ ఎంపీ భరత్
ప్రజల్లో ఎన్నో ఆశలు రేపి కూటమి అధికారంలోకి వచ్చిందని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ పేర్కొన్నారు. కానీ ఎన్నికల హామీలకు తూట్లు పొడుస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజమండ్రిలో గాంధీ విగ్రహానికి ఆయన వినతిపత్రం ఇచ్చారు. అమ్మకు సున్నం.. నాన్నకు మద్యం.. అన్న విధంగా ప్రభుత్వ తీరు ఉందన్నారు. నిత్యవసరాల ధరలు ఆకాశాన్నంటాయన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు కావడం లేదని మండిపడ్డారు
News October 2, 2024
రాజమండ్రి: ‘చమురు సంస్థల నుంచి పరిహారం ఇప్పించాలి’
రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరితో విజయవాడలో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు భేటీ అయ్యారు. ఉమ్మడి తూ.గో జిల్లాలోని సముద్ర పరివాహక ప్రాంతంలో ఉన్న పలువురు మత్స్యకారులకు చమురు సంస్థలు నుంచి పరిహారం కోరుతూ వినతి పత్రం ఇచ్చారు. కాకినాడ సిటీ, రూరల్, పిఠాపురం, తుని నియోజకవర్గాల్లో ఉన్న మత్స్యకారులందరికి పరిహారం ఇప్పించాలని కోరారు.
News October 2, 2024
తూ.గో.: నేడు యథావిధిగా పనిచేయనున్న విద్యాసంస్థలు
తూర్పు గోదావరి జిల్లాలో నేడు పాఠశాలలు యథావిధిగా పనిచేస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారి మంగళవారం తెలిపారు. దసరా సందర్భంగా మూడవ తేదీ గురువారం నుంచి 13వ తేదీ వరకు సెలవులు ప్రకటించామన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో గత నెల 2న విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన నేపథ్యంలో దాన్ని భర్తీ చేసేందుకు బుధవారం విద్యా సంస్థలకు సెలవు రద్దు చేసినట్లు తెలిపారు.