News June 15, 2024

HYD: ఈనెల 17న ప్రజావాణి లేదు: GHMC కమిషనర్

image

HYD ఖైరతాబాద్‌లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈనెల 17న ఉండదని GHMC ఇన్‌ఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి ఈరోజు తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించినందున ప్రజావాణి ఉండదని ఆమె స్పష్టం చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆమె కోరారు.

Similar News

News October 4, 2024

HYDలో T20 మ్యాచ్.. భారీ బందోబస్తు

image

ఈ నెల 12న ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో భారత్ VS బంగ్లాదేశ్ మధ్య T20-2024 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. అందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను రాచకొండ CP సుధీర్ బాబు పరిశీలించారు. అనంతరం DCPలు, ACPలు, HCA ప్రెసిడెంట్ జగన్‌ మోహన్‌తో సమావేశం నిర్వహించారు. క్రికెట్ అభిమానులకు అసౌకర్యం కలగవద్దని, T20 మ్యాచ్ నిర్వహణకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు CP సుధీర్ బాబు వెల్లడించారు.

News October 4, 2024

HYD: అమ్మవారి ఫేమస్ ఆలయాలకు మీరు వెళ్లారా?

image

HYD,ఉమ్మడి RRలోని ప్రసిద్ధ అమ్మవారి ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ మహంకాళమ్మ, జూబ్లీహిల్స్ పెద్దమ్మ, బల్కంపేట్ ఎల్లమ్మ, శామీర్‌పేట్ కట్ట మైసమ్మ, చార్మినార్ భాగ్యలక్ష్మీ, గోల్కొండ జగదాంబిక, లాల్‌దర్వాజ సింహవాహిని,మైసిగండి మైసమ్మ, కొత్తపేట అష్టలక్ష్మీ, బోడుప్పల్ నిమిషాంబిక ఆలయాల్లో వివిధ రూపాల్లో మాతలు దర్శనమిస్తున్నారు.మరి ఈఆలయాలకు మీరు వెళ్లారా కామెంట్ చేయండి.

News October 4, 2024

BREAKING: HYD: విషాదం.. ముగ్గురు చిన్నారులు మృతి

image

మేడ్చల్ జిల్లాలో కాసేపటి క్రితం విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. శామీర్‌పేట్ పరిధి మూడుచింతలపల్లి మండలం కొల్తూరు చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. దసరా సెలవుల నేపథ్యంలో హర్ష, మణికంఠ, మనోజ్ ఇంటి దగ్గర నుంచి ఆడుకుంటూ చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ ఈత కొడదామని దిగి ఊపిరాడక చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. > సెలవు రోజుల్లో పిల్లలు జర జాగ్రత్త..!