News June 15, 2024

ఇదే నా చివరి T20 WC: బౌల్ట్

image

ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్పే తనకు చివరిదని న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అన్నారు. అయితే ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తారా? లేక ఇతర ఫార్మాట్లలో కొనసాగుతారా? అనేదానిపై అతడు క్లారిటీ ఇవ్వలేదు. 34 ఏళ్ల వయసులోనూ అద్భుతంగా రాణిస్తున్న బౌల్ట్ ఈ WCలో 3 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీశారు. కానీ కివీస్ లీగ్ దశలోనే ఎలిమినేట్ అయింది.

Similar News

News November 8, 2025

ఈరోజు మీకు సెలవు ఉందా?

image

AP: మొంథా తుఫాను సమయంలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి రెండో శనివారం పాఠశాలలు నిర్వహించాలని DEOలు ఆదేశాలు ఇచ్చారు. దీంతో నేడు విశాఖ, ఏలూరు, బాపట్ల జిల్లాల్లో స్కూళ్లకు సెలవు రద్దు చేశారు. కర్నూలు, నంద్యాల, NTR, కడప, ప.గో, పల్నాడు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లోనూ పాఠశాలలకు సెలవు రద్దు చేసినట్లు తెలుస్తోంది. మరి మీ ప్రాంతంలో స్కూల్ ఉందా? COMMENT

News November 8, 2025

శ్రీవారి సుప్రభాత సేవ ఎలా జరుగుతుందంటే..?

image

తిరుమల శ్రీవారి ఆలయంలో తొలి సేవ ‘సుప్రభాతం’. ఇది ఉ.3 గంటలకు జరుగుతుంది. స్వామివారిని మేల్కొలిపే దివ్య ఘట్టమిది. పవిత్ర మంత్రాలు, శ్లోకాలు, మధుర నాదాలతో అర్చకులు స్వామివారిని నిదురలేపి, నిత్య కైంకర్యాలకు ఆహ్వానిస్తారు. ఈ సేవతోనే రోజు ప్రారంభమవుతుంది. ఈ సేవకు ఎంపికైన భక్తులకు స్వామివారిని <<17956589>>అతి దగ్గరి నుంచి<<>>(10Ft) దర్శించుకునే మహాభాగ్యం లభిస్తుంది. ☞ మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News November 8, 2025

M.T.U 1121.. పచ్చి బియ్యానికి అనుకూలం

image

ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బాగా ప్రాముఖ్యత కలిగి రైతులచే ఎక్కువగా సాగు చేయబడుతున్న రకం M.T.U 1121( శ్రీ ధృతి). దీని పంట కాలం 120-125 రోజులు. గింజ మధ్యస్త సన్నంగా ఉంటుంది. ఇది చేనుపై పడిపోకుండా అగ్గి తెగులును, దోమ పోటును తట్టుకుంటుంది. మిషన్ కోతకు కూడా అనుకూలమైన రకం. గింజ రాలిక తక్కువగా ఉంటుంది. పచ్చి బియ్యానికి ఈ రకం అనుకూలం. దిగుబడి ఎకరాకు సుమారు 3.5 టన్నులుగా ఉంటుంది.