News June 16, 2024
ఇంగ్లండ్ సూపర్-8 ఆశలు సజీవం
T20WCలో తప్పక గెలవాల్సిన మ్యాచులో ఇంగ్లండ్ విజయం సాధించింది. నమీబియాతో జరిగిన మ్యాచులో వర్షం కారణంగా ఓవర్లు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ENG 10 ఓవర్లలో 122 పరుగులు చేసింది. ఛేదనలో నమీబియా తడబడింది. DLS ప్రకారం 10 ఓవర్లలో 127 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా 84 పరుగులకే పరిమితమైంది. దీంతో ENG సూపర్-8 ఆశలు సజీవంగా ఉన్నాయి. ఒకవేళ AUSపై స్కాట్లాండ్ గెలిస్తే ENG టోర్నీ నుంచి నిష్క్రమించనుంది.
Similar News
News October 6, 2024
ఆంధ్రుల హక్కు ముఖ్యమా.. పొత్తు ముఖ్యమా?: షర్మిల
AP: సీఎం చంద్రబాబుకు ఆంధ్రుల హక్కులు ముఖ్యమా, లేదంటే బీజేపీతో పొత్తు ముఖ్యమా అని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ అంశంపై మోదీ, అమిత్ షాను నిలదీయాలని ఆమె డిమాండ్ చేశారు. ‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోతే మద్దతు ఉపసంహరించుకుంటామని డిమాండ్ చేయాలి. రాష్ట్ర ప్రయోజనాల కంటే పొత్తు ప్రయోజనాలు అంత ముఖ్యమేమీ కాదు’ అని ఆమె పేర్కొన్నారు.
News October 6, 2024
సీఎం రేవంత్ లేఖలో పొరపాటు.. BRS సెటైర్లు
TG: CM రేవంత్ ప్రధాని మోదీకి రాసిన లేఖపై BRS సెటైర్లు వేస్తోంది. అందులో నేటి తేది(06.10.2024)కి బదులుగా (07.10.2024) పేర్కొనడం ఇందుకు కారణం. దీంతో పాటు ఆగస్టు 15 వరకు రూ.17,869.22 కోట్లు రుణమాఫీ చేశామని ఈరోజు సీఎం లేఖలో చెప్పగా ఆగస్టు 15న చేసిన ట్వీట్లో మాత్రం రూ.31,000 కోట్లు మాఫీ చేశామని పేర్కొన్నారు. దీంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ శ్రేణులు ట్రోల్స్ చేస్తున్నాయి.
News October 6, 2024
బంగ్లాపై భారత్ గ్రాండ్ విక్టరీ
బంగ్లాదేశ్తో జరిగిన తొలి టీ20లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించడంతో బంగ్లాను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 128 పరుగుల టార్గెట్ను టీమ్ ఇండియా 11.5 ఓవర్లలోనే ఛేదించింది. సూర్య 29, శాంసన్ 29, అభిషేక్ 16, నితీశ్ 16* రన్స్ చేయగా చివర్లో హార్దిక్(16 బంతుల్లో 39*) బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డారు. 2 సిక్సర్లు, 5 ఫోర్లు బాది జట్టుకు విజయాన్ని అందించారు.