News June 16, 2024
కృష్ణా: ఫార్మసీ విద్యార్థులకు అలర్ట్

కృష్ణా వర్సిటీ పరిధిలో ఏప్రిల్ 2024లో నిర్వహించిన బీ-ఫార్మసీ 1వ సెమిస్టర్ పరీక్షలకు(2023- 24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు జూన్ 22వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు. వివరాలకు https://kru.ac.in/ వెబ్సైట్ చూడవచ్చన్నారు.
Similar News
News January 8, 2026
కృష్ణా: గృహ నిర్మాణాలపై కలెక్టర్ అసంతృప్తి

జిల్లాలో గృహ నిర్మాణ పనులు వేగవంతం చేసి సకాలంలో లబ్ధిదారులకు బిల్లులు చెల్లించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం గృహ నిర్మాణం పురోగతిపై కలెక్టరేట్లో ఆయన సమీక్షించారు. జిల్లాలో 24,133 గృహాలు నిర్మించాలన్నది లక్ష్యం కాగా ఇప్పటి వరకు 103 గృహాలు మాత్రమే పూర్తి కావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
News January 8, 2026
వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు: కలెక్టర్

రానున్న వేసవి కాలంలో జిల్లాలో తాగునీటి ఎద్దడి రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ DK బాలాజీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఆయన గ్రామీణ మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. జిల్లాలో అన్ని సమ్మర్ స్టోరేజీ చెరువులను నింపినట్లు చెప్పారు.
News January 8, 2026
కృష్ణా: ఫాస్ట్ ఫుడ్ వీడి.. చిరుధాన్యాల వైపు జనం మొగ్గు.!

మెట్రో నగరాలకే పరిమితమైన ‘మిల్లెట్స్’ ట్రెండ్ ఇప్పుడు చిన్న పట్టణాలకూ విస్తరించింది. ఆరోగ్యంపై పెరిగిన అవగాహనతో ప్రజలు ఫాస్ట్ ఫుడ్ కంటే పౌష్టికాహారానికే మొగ్గు చూపుతున్నారు. మచిలీపట్నం, గుడివాడ, పెడన తదితర ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా చిరుధాన్యాల మొలకలు, మిల్లెట్ టిఫిన్లు, ఫ్రూట్ సలాడ్స్ స్టాల్స్ కనిపిస్తున్నాయి. బస్టాండ్లు, పార్కులు, వాకింగ్ ట్రాక్ల వద్ద ఉదయం ఈ స్టాళ్ల వద్ద రద్దీ పెరిగింది.


