News June 16, 2024
స్పీకర్ పదవికి ప్రతిపక్షాలు పోటీ?

సార్వత్రిక ఎన్నికల్లో NDAకు గట్టి పోటీ ఇచ్చిన INDIA కూటమి గత ఐదేళ్లుగా ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కేంద్రం ఆ పదవి ఇవ్వకపోతే స్పీకర్ పదవికి పోటీ చేస్తుందని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 24న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండగా కొత్తగా ఎన్నికైన సభ్యులు లోక్సభ స్పీకర్ను ఎన్నుకోనున్నారు. మరోవైపు స్పీకర్ పదవిపై NDA <<13417512>>మిత్రపక్షాలు<<>> కన్నేసిన సంగతి తెలిసిందే.
Similar News
News November 3, 2025
మీర్జాగూడ ప్రమాదం.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

TG: మీర్జాగూడ<<18183462>> ప్రమాదంలో<<>> మృతులంతా చేవెళ్ల వాసులేనని తెలుస్తోంది. నిన్న ఆదివారం సెలవు దినం కావడంతో ఇంటికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం. మరణించిన వారిలో ఎక్కువ మంది ఉద్యోగులే ఉన్నారు. మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు సహాయక చర్యల పర్యవేక్షణకు సెక్రటేరియట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కాంటాక్ట్ నం: 9912919545, 9440854433.
News November 3, 2025
బస్సు ప్రమాదంలో 25కు పెరిగిన మృతుల సంఖ్య

TG: రంగారెడ్డి జిల్లా బస్సు ప్రమాదంలో <<18183371>>మృతుల సంఖ్య<<>> భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 25 మంది మరణించారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా తాండూరు, చేవెళ్ల వాసులేనని సమాచారం. మరోవైపు ఘటనాస్థలం వద్ద స్థానికులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే యాదయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డు విస్తరణ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు.
News November 3, 2025
ఎయిమ్స్ రాయ్బరేలిలో జూనియర్ రెసిడెంట్ పోస్టులు

ఎయిమ్స్ రాయ్బరేలి 16 జూనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఎంబీబీఎస్, BDS అర్హతతో పాటు ఇంటర్న్షిప్ చేసినవారు ఈనెల 10న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ట వయసు 37ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. నెలకు రూ.56,100 జీతం అందుతుంది. వెబ్సైట్: https://aiimsrbl.edu.in/


