News June 16, 2024
ఇక నా పయనం జగన్తోనే: రెడ్యం వెంకట సుబ్బారెడ్డి
వైఎస్ జగన్పై టీడీపీ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు చేసిన విషపూరిత వ్యాఖ్యలు టీడీపీ నీచ రాజకీయానికి, బలహీనతకు ప్రత్యక్ష నిదర్శమని వైసీపీ నేత రెడ్యం వెంకట సుబ్బారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఖాజీపేట మండలం దుంపలగట్టులోని ఆయన ఇంట్లో విలేకరులతో మాట్లాడారు. తాను ఎప్పుడు జగన్ వెంటే ఉంటానని, పార్టీ మారే ఆలోచన లేదన్నారు.
Similar News
News October 3, 2024
ఓటర్ల ప్రత్యేక జాబితాను సిద్ధం చేస్తున్నాం: కలెక్టర్
కడప ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా – 2025ను ఎలాంటి పెండింగ్ లేకుండా సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ శివశంకర్ లోతేటి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్కు తెలిపారు.
హౌస్టు హౌస్ ఓటర్ల సర్వే ప్రక్రియ జిల్లాలో 99.45 పూర్తయిందని చెప్పారు. ఫారం-6 ఫారం-7, ఫారం-8 సంబంధించి 01 జనవరి 2023 నుంచి 25 ఏప్రిల్ 2024 వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
News October 2, 2024
కడప: కేంద్ర కారాగారాన్ని సందర్శించిన కలెక్టర్
కడప జిల్లా కేంద్ర కారాగారాన్ని జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ సందర్శించారు. గాంధీ జయంతి పురస్కరించుకొని గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేశారు. జైలు జీవితం గడుపుతున్న ప్రతి ఒక్కరూ క్షణిక ఆవేశంలో తప్పులు చేసి ఉంటారని అన్నారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. జైలు జీవితం గడిపేవారు విడుదల అయిన తర్వాత మంచి జీవితాన్ని గడపాలని సూచించారు.
News October 2, 2024
సిద్దవటం: పెన్నా నదిలో పడి బాలుడు మృతి
సిద్దవటంలోని పెన్నా నదిలో బుధవారం పుల్లంపేట గ్రామానికి చెందిన ఇస్మాయిల్ (6) అనే బాలుడు ప్రమాదశాత్తు నీట మునిగి మృతి చెందాడు. తన బంధువులతో కలసి విహారయాత్రకు వచ్చిన ఇస్మాయిల్ ప్రమాదశాత్తు నీట మునిగాడు. ఒంటిమిట్ట సీఐ కృష్ణంరాజు నాయక్ సంఘటనా స్థలానికి చేరుకొని ఈతగాళ్ల సాయంతో బాలుడిని బయటికి తీసుకొచ్చారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.