News June 16, 2024
పవన్కు సాయి దుర్గ తేజ్ సర్ప్రైజ్ గిఫ్ట్!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఆయన మేనల్లుడు సాయి దుర్గ తేజ్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. స్టార్ వార్స్ లెగో సెట్ను ఆయనకు కానుకగా అందించారు. మరోవైపు పవన్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో సాయి తేజ్ నిన్న తిరుమల శ్రీవారి మెట్లు ఎక్కి మొక్కు తీర్చుకున్నారు. కాగా పవన్కు చిరంజీవి భార్య సురేఖ కూడా ఓ పెన్నును బహుమతిగా ఇచ్చారు. దాని విలువ ఏకంగా రూ.2.50 లక్షలు అని టాక్.
Similar News
News September 14, 2025
కొడుకును చంపి నదిలో పడేశాడు!

TG: హైదరాబాద్ బండ్లగూడ PS పరిధిలో దారుణం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న కొడుకు అనాస్(3)ను తండ్రి అక్బర్ దారుణంగా హత్య చేసి సంచిలో మూట కట్టి మూసీ నదిలో పడేశాడు. అనంతరం బాలుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చి పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. తానే నేరం చేసినట్లు అంగీకరించాడు. దీంతో కేసు నమోదు చేసి మూసీలో బాలుడి మృతదేహం కోసం గాలిస్తున్నారు.
News September 14, 2025
సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దు

AP: సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దైంది. అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో పర్యటన రద్దైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, ఏవియేషన్ అధికారుల నుంచి క్లియరెన్స్ వస్తే సీఎం తిరుపతి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో జరుగుతున్న మహిళా సాధికారత సదస్సులో ఇవాళ సీఎం పాల్గొనాల్సి ఉంది.
News September 14, 2025
స్పేస్ అప్లికేషన్ సెంటర్లో జాబ్లు

<