News June 16, 2024

నెల్లూరు: వేటకు బయల్దేరిన గంగపుత్రులు

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 12 మండలాల్లో 169 కి.మీ. మేర సముద్ర తీరం వెంబడి దాదాపు 98 గ్రామాల్లో సుమారు 1.50 లక్షల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. దాదాపు 41 వేల మంది చేపలవేటనే జీవనం మార్చుకుని జీవిస్తున్నారు. ఏటా దాదాపు 65 వేల టన్నుల మత్స్య సంపదను సముద్రం నుంచి సేకరిస్తున్నారు. వేట నిషేధకాలం ముగియడంతో 61 రోజుల తరువాత తెల్లవారు జామున మత్స్యకార గ్రామాల నుంచి పడవలు చేపల వేటకు బయలుదేరాయి.

Similar News

News October 3, 2024

పరిశుభ్రతే జాతిపితకు అసలైన నివాళులు; కలెక్టర్

image

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం ముగింపు కార్యక్రమాన్ని నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతే జాతిపితకు అసలైన నివాళులు అని అన్నారు. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో మున్సిపల్ కార్మికుల సేవలు చిరస్మరణీయం అని అన్నారు.

News October 2, 2024

చేజర్ల ఎమ్మార్వో నుంచి రూ.3.5 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

image

చేజర్ల తహశీల్దార్‌‌ను బెదిరించి సైబర్ నేరగాళ్లు రూ.3.5 లక్షలు దొచేశారు. సైబర్ నేరగాళ్లు చేజర్ల తహశీల్దార్‌ వెంకటరమణకు కాల్ చేసి అదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు బెదిరించారు. అనంతరం వారు ఐదు లక్షలు డిమాండ్ చేయగా తహశీల్దార్ మూడున్నర లక్షలు నగదు ఇచ్చారు. అనుమానం వచ్చి సంగం సీఐ వేమారెడ్డికి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News October 2, 2024

నెల్లూరు: KGBVలో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

నెల్లూరు జిల్లాలోని కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన, బోధనేతర సిబ్బందిని పొరుగుసేవల ప్రాతిపదికన ఏడాది కాలానికి భర్తీ చేసేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీసీ ఉషారాణి పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు apkgbv.apcfss.in వెబ్సైట్ ద్వారా రూ.250 దరఖాస్తు రుసుం చెల్లించి ఈనెల 10వతేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నా.