News June 16, 2024
వినుకొండలో రోడ్డు ప్రమాదం.. టిప్పర్ డ్రైవర్ మృతి
మండలంలోని శివాపురం సమీపంలో మామిడితోట ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ టిప్పర్ ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా, త్రిపురాంతకం మండలం ఎండ్లూరివారిపాలెం చెందిన లక్ష్మయ్య(45) గ్రామ సమీపంలోని ఇటుకల మట్టిని టిప్పర్ సాయంతో వినుకొండలో అన్లోడ్ చేసి తిరిగి వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పారు.
Similar News
News October 3, 2024
విజయవాడ, గుంటూరు మీదుగా తిరుపతికి APSRTC ఏసీ బస్సు
ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ, గుంటూరు మీదుగా తిరుపతికి ఇంద్ర AC బస్సు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతిరోజు అర్థరాత్రి ఒంటి గంటకు విజయవాడ చేరుకునే ఈ బస్సు (సర్వీస్ నం.47745) ఉదయం 8.45 గంటలకు తిరుపతి చేరుకుంటుందని, ప్రయాణికులు ఈ సర్వీసును ఆదరించాలని ఆర్టీసీ అధికారులు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
News October 3, 2024
గుంటూరు: చిల్లర సమస్యలకు చెక్ పెట్టేలా RTC కీలక నిర్ణయం
దసరాను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని APSRTC అధికారులు తెలిపారు. ఈ నెల 4 నుంచి 20 వరకు సాధారణ ఛార్జీలతోనే ఈ బస్సులు నడుపుతామన్నారు. ప్రయాణికులకు చిల్లర సమస్య రాకుండా ఉండేందుకు UTS, నగదు చెల్లింపు యాప్స్ అందుబాటులో ఉంటాయన్నారు. దసరా సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు మొత్తంగా 6,100 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు.
News October 3, 2024
చేనేత వస్త్రాలను అందరూ ఆదరించాలి: మంత్రి సవిత
చేనేత వస్త్రాలను ఆదరించి, నేత కార్మికులకు అందరూ అండగా నిలవాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత సూచించారు. గుంటూరులోని సిద్ధార్థ గార్డెన్స్ లో బుధవారం ఏర్పాటు చేసిన చేనేత, వస్త్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. వివిధ ప్రాంతాలకు చెందిన నాణ్యమైన వస్త్రాలు ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయని చెప్పారు. దసరా పండగ సందర్భంగా ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ ను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.