News June 16, 2024
సంచలన ఉత్తర్వులు ఇచ్చిన తిరుపతి కోర్టు

తిరుపతిలో 2023 సెప్టెంబర్లో జరిగిన చోరీ కేసులో ఈస్ట్ CIని A2గా చేర్చి కేసు ఫైల్ చేయాలని తిరుపతి 2వ మున్సిఫ్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో TDP అధినేత చంద్రబాబు, లోకేశ్ ఫొటోలతో ఉన్న 36 గ్రాముల బంగారు ఉంగరాన్ని టి.జయరామిరెడ్డి ఓ రెస్టారెంట్లో పోగొట్టుకున్నారు. దీనిపై కేసు ఫైల్ చేయకపోగా నిందితుడ్ని వదిలేశారు. బాధితుడు కోర్టులో ప్రైవేట్ కేసు వేయడంతో.. జడ్జీ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.
Similar News
News March 18, 2026
చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్

చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు ఓ చిన్నారి ప్రాణాన్ని కాపాడారు. పాకాల(M) దామలచెరువుకు చెందిన శిరీష, విజయ్ దంపతులకు నెలలు నిండకుండా పాప పుట్టింది. పాలు సరిగ్గా తాగకకపోవడం, తల అసాధారణంగా పెరగడం, తరచూ మూర్చ రావడం వంటి లక్షణాలతో బాధ పడుతుంటేది. తలలో రక్త స్రావం, నీరు చేరినట్లు గుర్తించారు. న్యూరో సర్జన్ డాక్టర్ సాయినాథ్ రెడ్డి నేతృత్వంలో బ్రెయిన్ ఆపరేషన్ చేసి చిన్నారిని కాపాడారు.
News March 18, 2026
కేంద్ర మంత్రిని కలిసిన రోజా

నగరి నియోజకవర్గ సమస్యలను కేంద్రమంత్రి గడ్కరీ దృష్టికి తీసుకెళ్లినట్లు మాజీ మంత్రి రోజా తెలిపారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాన్ని తొలగించేలా చేస్తున్నారని ఆయన దృష్టికి తీసుకుపోయారు. కొండచుట్టూ మండప ప్రాధాన్యాన్ని తెలియజేసి, వాటిని కాపాడేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని విన్నవించినట్లు పేర్కొన్నారు.
News March 18, 2026
చిత్తూరు ZP విభజనకు కసరత్తు.!

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని జిల్లా పరిషత్ను ఎన్నికల నాటికి మూడు జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసేలా రాష్ట్రస్థాయిలో కసరత్తు నిర్వహిస్తున్నారు. సెప్టెంబరులో జడ్పీ పదవీకాలం ముగియనుండటంతో, ఆలోపు విభజించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు కొత్తగా జిల్లా పరిషత్తులు ఏర్పడనున్నాయి. దీంతో పరిపాలనా సౌలభ్యం మెరుగు పడనుంది.


