News June 16, 2024

సంచలన ఉత్తర్వులు ఇచ్చిన తిరుపతి కోర్టు

image

తిరుపతిలో 2023 సెప్టెంబర్‌లో జరిగిన చోరీ కేసులో ఈస్ట్ CIని A2గా చేర్చి కేసు ఫైల్ చేయాలని తిరుపతి 2వ మున్సిఫ్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో TDP అధినేత చంద్రబాబు, లోకేశ్ ఫొటోలతో ఉన్న 36 గ్రాముల బంగారు ఉంగరాన్ని టి.జయరామిరెడ్డి ఓ రెస్టారెంట్‌లో పోగొట్టుకున్నారు. దీనిపై కేసు ఫైల్ చేయకపోగా నిందితుడ్ని వదిలేశారు. బాధితుడు కోర్టులో ప్రైవేట్ కేసు వేయడంతో.. జడ్జీ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.

Similar News

News May 8, 2025

మంత్రి లోకేశ్‌తో ఎమ్మెల్యే థామస్ భేటీ

image

తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం శ్రీ సిటీకి చేరుకున్న మంత్రి లోకేశ్‌ను GDనెల్లూరు ఎమ్మెల్యే థామస్ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని థామస్, మంత్రిని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు.

News May 7, 2025

28న చిత్తూరులో జాబ్ మేళా

image

చిత్తూరు జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో ఈనెల 28న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ పద్మజ తెలిపారు. వివిధ ప్రముఖ కంపెనీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. 19 నుంచి 35 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు అర్హులు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు ఉపాధి కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు.

News May 7, 2025

సీఎంను కలిసిన రామకుప్పం టీడీపీ నాయకులు 

image

ఇటీవల జరిగిన రామకుప్పం ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలుపొందిన సులోచన గుర్రప్ప, వెంకట్రామయ్య గౌడు శనివారం సీఎం చంద్రబాబును కలిశారు. అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో సీఎంను కలిశారు. తమకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రామకుప్పం మండలాభివృద్ధికి సంబంధించి పలు విషయాలను వారు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.