News June 16, 2024

ఫర్నిచర్ దొంగ జగన్: మంత్రి అనగాని

image

AP: ప్రభుత్వ ఫర్నిచర్‌ను జగన్ వాడుకుంటున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ‘జగన్ ఫర్నిచర్ దొంగ. ఆయనకు నైతికత ఉంటే ఫర్నిచర్‌ను ప్రభుత్వానికి అప్పగించాలి. సరెండర్ చేయకుండా YCP నేతలు నీతులు చెప్పడం సిగ్గుచేటు. ₹50 కోట్ల CMO డబ్బుతో తాడేపల్లి, లోటస్‌పాండ్లలోని ఇళ్లలోకి ఫర్నిచర్, ఇతర వసతులను జగన్ అమర్చుకున్నారు. గతంలో కోడెలకు జగన్ చేసిందే ఈరోజు ఆయనకు తిరిగి వచ్చింది’ అని మంత్రి విమర్శించారు.

Similar News

News February 2, 2025

కోటి మందే కానీ.. దేశ ఆదాయానికి వారే కీలకం

image

మన దేశ జనాభా 140 కోట్ల పైనే. అందులో ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసింది 7.5 కోట్ల మందే (FY 2024-25). ఇందులో 6.5 కోట్ల మంది ఆదాయం రూ.12 లక్షల కంటే తక్కువే. కోటి మందే రూ.12 లక్షల కంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉండి ఆదాయపు పన్ను కడుతున్నారు. కానీ వీరు దేశ ఆదాయానికి ఎక్కువ నిధులు సమకూరుస్తున్నారు. అప్పుల ద్వారా ఖజానాకు 24 % వాటా వస్తే.. ఆదాయపు పన్ను ద్వారా 22% వస్తోందని ప్రభుత్వం వెల్లడించింది.

News February 2, 2025

తెలుగులో అత్యధిక సబ్‌స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్

image

*ప్రషు బేబీ- 11.4 మిలియన్స్
*హర్ష సాయి ఫర్ యూ తెలుగు- 10.9M
*తేజ్ ఇండియా- 5.56 M
*ఫిల్మిమోజి (ఎంటర్‌టైన్‌మెంట్)- 5.31M
*షణ్ముఖ్ జశ్వంత్- 4.93M.
*ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు- 4.73M
*శ్రావణి కిచెన్- 4.7M
*బ్యాంకాక్ పిల్ల- 3.61M
*అమ్మచేతి వంట- 3.52M
*మై విలేజ్ షో- 3.1M
*మీడియాకు మినహాయింపు. ఇవి పర్సనల్ ఛానల్స్.

News February 2, 2025

వాణిజ్య పోరులో విజేతలు ఉండరు: చైనా

image

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమపై తమ ఉత్పత్తులపై 10 శాతం సుంకాన్ని విధించడాన్ని చైనా ఖండించింది. ‘వాణిజ్య యుద్ధాల్లో విజేతలు ఉండరు. ఏకపక్షంగా సుంకాలు విధించడం ద్వారా ప్రపంచ వాణిజ్య సంస్థ(WTO) నిబంధనల్ని అమెరికా తీవ్రంగా ఉల్లంఘించింది. మా దేశ హక్కుల్ని, ప్రయోజనాల్ని కాపాడుకునేందుకు కచ్చితంగా అమెరికాకు తగిన విధంగా బదులిస్తాం’ అని ఆ దేశ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.