News June 16, 2024
BHPL: గోదావరిలో యువకుడు గల్లంతు

భూపాలపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. కాళేశ్వరం త్రివేణి సంగమ గోదావరి నదిలో స్నానానికి దిగిన యువకుడు గల్లంతయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం..
వరంగల్ పట్టణానికి చెందిన గరికపాటి అఖిల్(19) ప్రమాదవశాత్తు గోదావరిలో గల్లంతు కాగా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని స్థానిక జాలరు, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 18, 2026
వరంగల్: రెండవ రోజు 99.9 శాతం విద్యార్థులు హాజరు

పదవ తరగతి పబ్లిక్ పరీక్షల రెండవరోజు వరంగల్ జిల్లాలో మొత్తం 99.91 శాతం విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 9,482 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 9,473 మంది హాజరు కాగా 9 మంది గైర్హాజయ్యారు. మొత్తంగా హిందీ పరీక్షకు 99.91 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంగతులు జరగలేదని డీఈవో రంగయ్య తెలిపారు.
News March 16, 2026
స్త్రీనిధి రుణాలు పక్కదారి.. రూ.1.50 కోట్లు గోల్మాల్

వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో స్త్రీనిధి రుణాలు దారి తప్పాయి. మహిళా సంఘాల సభ్యుల నుంచి కిస్తీలు వసూలు చేసిన 50 మంది రిసోర్స్ పర్సన్లు (ఆర్పీలు), ఆ సొమ్మును బ్యాంకులో జమ చేయకుండా సుమారు రూ.1.50 కోట్లు సొంతానికి వాడుకున్నారు. అధికారుల నోటీసులతో అసలు విషయం బయటపడటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. బాధ్యులైన ఆర్పీలకు అధికారులు మెమోలు జారీ చేశారు.
News March 16, 2026
WGL: సింహపురి ఎక్స్ప్రెస్ నుంచి జారిపడి వ్యక్తి మృతి

వరంగల్-కాజీపేట స్టేషన్ల మధ్య హంటర్ రోడ్ శాయంపేట రైల్వే గేట్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున సింహపురి ఎక్స్ప్రెస్ నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వద్ద ఈనెల 15నాటి ఆర్టీసీ ఎక్స్ రోడ్స్-సికింద్రాబాద్ బస్సు టికెట్, సప్తగిరి థియేటర్ సినిమా టికెట్ లభించాయి. ఇతర గుర్తింపు ఆధారాలు లేకపోవడంతో మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు.


