News June 17, 2024
లేటుగా వచ్చే ఉద్యోగుల సెలవుల్లో కోత పెట్టండి: కేంద్రం

ఉద్యోగుల హాజరుపై కఠినంగా వ్యవహరించాలని అన్ని ప్రభుత్వ శాఖలను కేంద్రం ఆదేశించింది. తరచూ ఆఫీసులకు లేటుగా రావడం, సమయం ముగియకముందే వెళ్లిపోవడాన్ని ఉపేక్షించరాదని పేర్కొంది. చాలామంది బయోమెట్రిక్ హాజరు వేయడం లేదని గుర్తించామంది. ఆలస్యంగా వచ్చిన, ముందుగా వెళ్లిపోతున్న వారి సెలవుల్లో కోత పెట్టాలంది. తగిన కారణాలుంటే నెలలో రెండుసార్లు, రోజుకు గంటకు మించకుండా లేటుగా రావడాన్ని క్షమించొచ్చని తెలిపింది.
Similar News
News November 12, 2025
రికార్డు స్థాయిలో ఒకేసారి 3 లక్షల గృహ ప్రవేశాలు

AP: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఒకేసారి 3 లక్షల గృహ ప్రవేశాలు జరగనున్నాయి. అన్నమయ్యలోని దేవగుడి పల్లి నుంచి సీఎం చంద్రబాబు వర్చువల్గా వీటిని ప్రారంభిస్తారు. పీఎం ఆవాస్ యోజన కింద 2,28,034 లక్షలు, పీఎంఏవై గ్రామీణ్ కింద 65,292, PMAY జన్మన్ పథకం కింద 6,866 ఇళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా గృహ ప్రవేశాలు జరగనున్నాయి. ఆయా జిల్లాల్లో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
News November 12, 2025
బాల్య వివాహాలు ఎలా మొదలయ్యాయి?

బాల్య వివాహాలు ముందు నుంచే లేవు. క్రీస్తు పూర్వం 4 సంవత్సరం నుంచి ఇవి మొదలయ్యాయి. బొమ్మల పెళ్లిళ్లు వీటికి దోహదం చేశాయి. పరదేశీయులు దండయాత్రల్లో తమకు చిక్కిన ఆడపిల్లలను చెరిపేవారు. ఇలాంటి దుస్థితి రాకూడదని తల్లిదండ్రులు తమ బిడ్డలకు త్వరగా పెళ్లి చేసి అత్తారిండ్లకు పంపేవారు. అయితే ఈ సంస్కృతి కారణంగానే ఆడపిల్లలు వేదాలు చదవడం, విద్యను అభ్యసించడం నిషిద్ధం అనే దుష్ప్రచారం మొదలైంది. <<-se>>#Pendli<<>>
News November 12, 2025
భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు.. కనిష్ఠంగా 8.7 డిగ్రీలు నమోదు

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. నిన్న తెలంగాణలో అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కనిష్ఠంగా ఆసిఫాబాద్లోని లింగాపూర్లో 8.7 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో 14.7, మచ్చబొల్లారం, గచ్చిబౌలిలో 15 డిగ్రీలు నమోదైనట్లు వెల్లడించింది. రాబోయే రోజుల్లో టెంపరేచర్లు మరింత పడిపోతాయని హెచ్చరించింది.


