News June 17, 2024
నీట్ పేపర్ లీక్ కాలేదు.. రెండుచోట్ల అవకతవకలు: కేంద్రమంత్రి

AP: నీట్ పేపర్ లీకేజీ జరగలేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పునరుద్ఘాటించారు. పరీక్ష పారదర్శకంగా జరిగిందని అన్నారు. రెండు పరీక్ష కేంద్రాల్లోనే అక్రమాలు జరిగినట్లు గుర్తించామని తెలిపారు. ఇందులో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సుప్రీం ఆదేశాల మేరకు 1563 మంది అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
Similar News
News March 22, 2026
భోజనం తర్వాత మళ్లీ ఆకలి వేస్తోందా?

రాత్రి భోజనం తిన్నాక అర్ధరాత్రి మళ్లీ ఆకలి వేసే సమస్య పెరుగుతోంది. దీంతో జంక్ ఫుడ్ తిని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. దీన్ని నియంత్రించడానికి నిపుణులు పలు చిట్కాలు చెబుతున్నారు. ‘రాత్రి ఆహారంలో పప్పులు, గుడ్లు, పనీర్, గోధుమలు, రాగులు, బ్రౌన్ రైస్ తీసుకుంటే కడుపు నిండుగా ఉంటుంది. పెరుగన్నం, గుప్పెడు నట్స్ తిన్నా, పసుపు కలిపిన గ్లాసు గోరు వెచ్చని పాలు తాగినా ఆకలి తగ్గుతుంది’ అని పేర్కొంటున్నారు.
News March 22, 2026
ఈ జర్నీ అంత సులభం కాదు: అనయా బంగర్

ఇటీవల లింగ మార్పిడి <<19387841>>సర్జరీ<<>> చేయించుకున్న భారత్ మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడు అనయా బంగర్ SMలో భావోద్వేగ పోస్ట్ చేశారు. అమ్మాయిగా మారాలనే తన నిర్ణయాన్ని తన తండ్రి, ఫ్యామిలీ సపోర్ట్ చేయడం అంత ఈజీగా జరగలేదని తెలిపారు. తన తండ్రి అండగా ఉండటంతోనే ఇది సాధ్యమైందన్నారు. అనయాబంగర్గా గుర్తింపును మార్చుకున్న ఆర్యన్ బంగర్ 2024లో హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ, రీసెంట్గా ఈ సర్జరీ చేయించుకున్నారు.
News March 21, 2026
సహజత్వానికి భంగం కలగకుండా భద్రాచలం ఆలయ అభివృద్ధి: CM

TG: భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధిపై CM రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఆలయ సహజత్వానికి భంగం కలగకుండా పూర్తిగా ఆగమశాస్త్రానుసారం అభివృద్ధి పనులు నిర్వహించాలని సూచించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా మూడు దశల్లో పనులను పూర్తి చేయాలన్నారు. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి చేయగలిగిన పనులను ముందుగా గుర్తించి 2027 మార్చి 31 నాటికి పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని ఆదేశించారు.


