News June 17, 2024
వర్షాలేవీ..? జులైపైనే భారం!

TG: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే దేశంలోకి ప్రవేశించడంతో తొలకరి వర్షాలు పలకరించాయి. కానీ ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేశాడు. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదుకావడంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. అయితే ప్రస్తుతం రుతుపవనాలు ఉత్తర భారతంపై ప్రభావం చూపుతున్నాయని IMD పేర్కొంది. ఈనెల చివరినాటికి రాష్ట్రంవైపు మళ్లి జులైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Similar News
News March 10, 2026
కూతురికి బర్త్డే విషెస్.. అరుదైన ఫొటోలు షేర్ చేసిన చిరు

తన కుమార్తె సుష్మిత కొణిదెల పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి షేర్ చేసిన అరుదైన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. చిన్నప్పుడు ఊయలలో ఉన్నప్పటి నుంచి నేడు తండ్రి సినిమాకే నిర్మాతగా మారి పక్కన నిల్చున్న వరకు ఉన్న జర్నీని గుర్తుచేసుకున్నారు. ‘నా సినిమాలు చూసే స్థాయి నుంచి నాతో సినిమా తీసి బ్లాక్బస్టర్ ఇచ్చే స్థాయికి ఎదగడం తండ్రిగా మర్చిపోలేని అనుభూతి’ అంటూ చిరు ఎమోషనల్ పోస్ట్ రాసుకొచ్చారు.
News March 10, 2026
గడ్డి మందు పిచికారీ – ఈ జాగ్రత్తలు తప్పనిసరి

కలుపు నివారణకు పారాక్వాట్ డైక్లోరైడ్ వినియోగం విపరీతంగా పెరిగింది. దీన్ని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పిచికారీ చేస్తున్నారు. ఈ మందు పొరపాటున గాలి ద్వారా శరీరంలోకి వెళ్తే లంగ్స్, లివర్, కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. తక్కువ సమయంలోనే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో మరణం సంభవిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే గడ్డి మందును పిచికారీ చేసేటప్పుడు రైతులు మాస్కులు, చేతికి గ్లౌజులు ధరించాలి.
News March 10, 2026
కలుపు ముప్పు తగ్గాలంటే ఇలా చేయాలి

పంట వేసేందుకు పొలాన్ని 2 నుంచి 3 దఫాలుగా దున్నడం వల్ల తొలిదశలోనే కలుపు విత్తనాలు మెులిచి మున్ముందు కలుపు సమస్య అంతగా ఉండదు. ప్లాస్టిక్ మల్చింగ్ షీట్స్, పంట వ్యర్థాలను, వరి గడ్డిని నేలపై చదునుగా పరచడం, అంతరకృషి వంటివి కలుపును తగ్గించి పంటకు, నేలకు మేలు చేస్తుందనే వాస్తవాన్ని రైతులు తెలుసుకోవాలి. కలుపు మందును వాడాల్సి వస్తే తప్పకుండా నిపుణులు సూచన మేరకే వాడాలి. వ్యాపారుల ప్రమేయం ఉండకపోవడం మంచిది.


