News June 17, 2024

ఇవాళ్టితో ముగుస్తున్న గడువు

image

TG: ఓయూతో పాటు రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల్లో ప్రవేశాలకు నిర్వహించే సీపీజీఈటీ-2024 దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. రూ.500 అపరాధ రుసుముతో ఈ నెల 25, రూ.2000 ఫైన్‌తో ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 6 నుంచి 15 వరకు పరీక్షలు కొనసాగుతాయి. రేపు పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేయనున్నారు. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News October 7, 2024

అల్పపీడనం ఎఫెక్ట్.. రేపు భారీ వర్షాలు

image

ఏపీలో అల్పపీడన ప్రభావంతో ఇవాళ పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, ప్రకాశం, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుసే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణలో రెండు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.

News October 7, 2024

ఇజ్రాయెల్, హమాస్ యుద్ధానికి ఏడాది

image

ఇజ్రాయెల్, హమాస్ యుద్ధానికి ఏడాది పూర్తి అయింది. 2023, అక్టోబర్ 7న హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయెల్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. పిల్లలు, యువతుల్ని బందీలుగా తీసుకెళ్లడంతో పాలస్తీనాలో IDF ఏరివేత మొదలు పెట్టింది. దీంతో లక్షలాది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. మధ్యలో బందీలను ఎక్స్‌ఛేంజ్ చేసుకున్నా హెజ్బొల్లా దూరడంతో వివాదం మరో టర్న్ తీసుకుంది. ఇప్పుడు ఇరాన్‌తో ప్రత్యక్ష యుద్ధం స్థాయికి చేరింది.

News October 7, 2024

జగన్ పుంగనూరు పర్యటన రద్దు: పెద్దిరెడ్డి

image

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుంగనూరు పర్యటన రద్దయినట్లు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. హత్యకు గురైన ఆరేళ్ల చిన్నారి కుటుంబాన్ని ఎల్లుండి పరామర్శించాల్సి ఉండగా అనివార్య కారణాలతో రద్దు చేసుకున్నట్లు చెప్పారు. జగన్ పర్యటిస్తారనే భయంతోనే ముగ్గురు మంత్రులు ఆఘమేఘాల మీద ఇక్కడికొచ్చారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి ఘటనల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.