News June 17, 2024

కారంచేడు: స్వర్ణమ్మ తల్లికి వెయ్యి సంవత్సరాల చరిత్ర

image

వెయ్యి ఏళ్ల చరిత్ర కల్గిన స్వర్ణమ్మ తల్లికి స్వర్ణ గ్రామంతో అనుబంధం ఉందని స్థానికులు చెబుతున్నారు. పూర్వం వరదలు వచ్చినప్పుడు చీరాల నుంచి వరద నీరు స్వర్ణ గ్రామాన్ని ముంచెత్తితే స్వర్ణమ్మ తన కొంగును అడ్డు పెట్టి గ్రామాన్ని కాపాడిందని భక్తులు చెబుతూఉంటారు. స్వర్ణమ్మ తల్లి కోర్కెలు తీరుస్తుందని..ఏ శుభకార్యం జరిగినా తొలి అహ్వాన పత్రికను అమ్మవారికే సమర్పిస్తారని స్థానికులు డెబుతున్నారు.

Similar News

News October 3, 2024

చీరాలలో పిడుగుపాటుకు విద్యార్థిని మృతి

image

చీరాల మండలం పాతచీరాలలో తీవ్ర విషాదం నెలకొంది. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తులసి పిడుగుపాటుకు గురై గురువారం మృతి చెందింది. దసరా సెలవులు ఇవ్వడంతో తులసి అమ్మమ్మ ఇంటికి వచ్చింది. గురువారం ఉదయం వర్షం పడుతున్న సమయంలో మేడ పైకి వెళ్లింది. అదే సమయంలో తులసి మీద పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందింది.

News October 3, 2024

ఒంగోలులో సందడి చేయనున్న కీర్తి సురేశ్

image

ఒంగోలులో గురువారం ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేశ్ సందడి చేయనున్నారు. నగరంలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఉదయం10:30 గంటలకు హాజరుకానున్నారు. వీరితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు. హీరోయిన్ కీర్తి సురేశ్ మొదటి సారిగా ఒంగోలుకు వస్తున్న తరుణంలో యువత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

News October 3, 2024

ఒంగోలు: నేటి నుంచి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు

image

ఒంగోలులోని కొండమీద వెలసిన శ్రీగిరి వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలను నేటి నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్‌పర్సన్‌ ఆలూరు ఝాన్సీ రాణి తెలిపారు. సాయంత్రం 6 గంటలకు బ్రహ్మోత్సవాలు కలశ స్థాపనతో ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు.