News June 17, 2024

కర్నూలు: ముంతాజ్ బేగంకు జాతీయ యోగా పురస్కారం

image

కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ యోగా గురువు డాక్టర్ ఎస్.ముంతాజ్ బేగంకు జాతీయ యోగా టీచర్ అవార్డుతో పాటు యోగారత్న అవార్డును హరియాణాకు చెందిన మానవియ్య నిర్మాణ్ మంచ్ ఇండియా ప్రకటించింది. 15ఏళ్లుగా నిర్విరామంగా యోగాతో పాటు సేవా కార్యక్రమాలను నిర్వహించినందుకు గాను ఈ అవార్డు అందజేయనున్నారు. జూన్ 21న 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ఈ అవార్డును ముంతాజ్ బేగం హరియణాలో అందుకోనున్నారు.

Similar News

News March 13, 2026

కర్నూలులో గ్యాస్ కొరతపై అపోహలు వద్దు: జేసీ

image

జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత లేదని, గృహ వినియోగదారులు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు. ప్లాంట్లలో 3-6 రోజుల స్టాక్ అందుబాటులో ఉందన్నారు. కమర్షియల్ సంస్థలు డొమెస్టిక్ సిలిండర్లు వాడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారుల రక్షణ చట్టంపై అవగాహన పెంచాలన్నారు. మార్కెట్లలో ఆహార నాణ్యత, తూనికలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై ఆకస్మిక తనిఖీలు చేపట్టాలన్నారు.

News March 13, 2026

సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ

image

ప్రముఖులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు ఎస్పీ విక్రాంత్ విక్రాంత్ హెచ్చరించారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వేదికల్లో తప్పుడు వార్తలు, ద్వేషపూరిత పోస్టులు చేస్తే గుర్తించి కేసులు నమోదు చేస్తామని తెలిపారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగించాలని ప్రజలకు సూచించారు.

News March 13, 2026

పరీక్షలకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు: డీఈవో

image

ఈ నెల 16 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు జిల్లా వ్యాప్తంగా జరగబోయే 10వ తరగతి పరీక్షలకు హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసినట్లు డీఈవో సుధాకర్ తెలిపారు. విద్యార్థులు గానీ వారి తల్లిదండ్రులు గానీ ఏదైనా అత్యవసరం ఉంటే
బాలాజీ 9000822394, శ్రీనివాసులు 8639353678 నంబర్లకు సంప్రదించాలని సూచించారు. విద్యార్థులకు హాల్ టికెట్ ఇవ్వకుంటే తమ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు.