News June 17, 2024
పెద్దిరెడ్డి పాపాలన్నీ బయటకు తీస్తాం: మంత్రి

వైసీపీ పాలనలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం తిన్నదంతా కక్కిస్తామని రవాణ శాఖా మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాయచోటిలో ఆయన మాట్లాడుతూ.. ‘పెద్దిరెడ్డి పాపాలన్నీ బయటకు తీస్తాం. అక్రమ సంపాదన కోసం పాలు, ఇసుక, మద్యం, ఎర్రచందనం దేన్నీ ఆయన ఫ్యామిలీ వదల్లేదు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో అనుమతులు లేకుండా రూ.700 కోట్లతో రిజర్వాయర్ కట్టారు. అక్కడ రైతుల భూములు లాగేసుకున్నారు’ అని ఆయన ఆరోపించారు.
Similar News
News May 8, 2025
మంత్రి లోకేశ్తో ఎమ్మెల్యే థామస్ భేటీ

తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం శ్రీ సిటీకి చేరుకున్న మంత్రి లోకేశ్ను GDనెల్లూరు ఎమ్మెల్యే థామస్ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని థామస్, మంత్రిని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు.
News May 7, 2025
28న చిత్తూరులో జాబ్ మేళా

చిత్తూరు జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో ఈనెల 28న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ పద్మజ తెలిపారు. వివిధ ప్రముఖ కంపెనీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. 19 నుంచి 35 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు అర్హులు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు ఉపాధి కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు.
News May 7, 2025
సీఎంను కలిసిన రామకుప్పం టీడీపీ నాయకులు

ఇటీవల జరిగిన రామకుప్పం ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలుపొందిన సులోచన గుర్రప్ప, వెంకట్రామయ్య గౌడు శనివారం సీఎం చంద్రబాబును కలిశారు. అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో సీఎంను కలిశారు. తమకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రామకుప్పం మండలాభివృద్ధికి సంబంధించి పలు విషయాలను వారు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.