News June 17, 2024
VZM: రైలు ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన వ్యక్తి

రైలు ప్రమాదంలో కొత్తవలసకి చెందిన గోలజాపు పెంటయ్య(60) రెండు కాళ్లను కోల్పోయారు. బహిర్భూమికి వెళ్లి రైలు పట్టాలు దాటుతుండగా కొత్తవలస రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్-1 చివరలో విజయనగరం నుంచి విశాఖ వెళ్లే రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో క్షతగాత్రుడికి రెండు కాళ్ళు ఛిద్రమయ్యాయి. వెంటనే 108కి ఫోన్ చేసి క్షతగాత్రుడిని విశాఖ కేజీహెచ్కు తరలించినట్లు ఆర్పీఫ్ ఎస్సై ఆర్.హసిధ, ఏఎస్ఐ ఎ.ధర్మారావు తెలిపారు.
Similar News
News November 7, 2025
‘కూటమిగా పోరాడదాం.. మెంటాడను సాధిద్దాం’

మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలో కొనసాగించేకు ఉమ్మడిగా పోరాడాలని జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు అన్నారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన నాయకులు సమావేశం అయ్యారు. మెంటాడ మండలం పార్వతీపురం జిల్లాలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. త్వరలో మండల ప్రజల అభిప్రాయాలను ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులకు తెలియజేస్తామన్నారు.
News November 7, 2025
VZM: ‘మాతృ, శిశు మరణాలు జరగకుండ చర్యలు అవసరం’

జిల్లాలో మాతృ, శిశు మరణాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. ఎస్. జీవనరాణి వైద్య సిబ్బందికి ఆదేశించారు. గురువారం తన కార్యాలయంలో సిబ్బందితో కమిటీ సమావేశం నిర్వహించారు. గత నెలలో జరిగిన 3 మాతృ మరణాలు, 6 శిశు మరణాలకు గల కారణాలను విశ్లేషించాలని సూచించారు. మాతృ, శిశు మరణాల సంభవించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
News November 7, 2025
VZM: ‘ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షానే ఉంటుంది’

తుఫాన్ హెచ్చరికలు వచ్చిన వెంటనే ముందస్తు చర్యలు తీసుకోవడంతో నష్టాన్ని తగ్గించగలిగామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షానే ఉంటుందని అన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. అధిక మోతాదులో యూరియా వినియోగించడం వల్ల మానవ ఆరోగ్యానికి ప్రమాదం కలుగుతుందన్నారు.


