News June 17, 2024
T20WC సూపర్-8: గ్రూప్-1, గ్రూప్-2లో జట్లివే..
టీ20 WCలో కీలకమైన రెండో దశకు తెర లేవనుంది. రేపటి నుంచి సూపర్-8 పోరు ప్రారంభం కానుంది. ఇందులో జట్లు 2 గ్రూపులుగా విడిపోయి తలపడతాయి. గ్రూప్-1లో భారత్, AUS, అఫ్గానిస్థాన్, బంగ్లా చోటు సంపాదించాయి. ఇక గ్రూప్-2లో USA, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ పోటీ పడతాయి. ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన టీమ్లు సెమీస్కు చేరుతాయి. భారత్ 20న ఆఫ్గానిస్థాన్, 22న బంగ్లా, 24న AUSతో ఆడనుంది.
Similar News
News October 7, 2024
బంగ్లాపై గెలుపు.. టీమ్ ఇండియా రికార్డులు
తొలి T20లో బంగ్లాదేశ్పై ఘన <<14290970>>విజయం<<>> సాధించిన టీమ్ ఇండియా పలు రికార్డులు సృష్టించింది. ప్రత్యర్థి జట్లను అత్యధికసార్లు(42) ఆలౌట్ చేసిన టీమ్గా పాక్ వరల్డ్ రికార్డును సమం చేసింది. ఆ తర్వాత కివీస్(40), ఉగాండా(35), విండీస్(32) ఉన్నాయి. అలాగే 120+ పరుగుల లక్ష్యాన్ని భారత్ అత్యంత వేగంగా(11.5 ఓవర్లు) ఛేజ్ చేసింది. సూర్య సేనకు ఇదే ఫాస్టెస్ట్ ఛేజ్. 2016లో బంగ్లాపైనే 13.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేజ్ చేసింది.
News October 7, 2024
Stock Market: లాభాల్లోనే మొదలయ్యాయ్
గ్లోబల్ మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్ అందడంతో భారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. BSE సెన్సెక్స్ 81962 (274), NSE నిఫ్టీ 25072 (57) వద్ద ట్రేడవుతున్నాయి. ఐటీ షేర్లు జోరు ప్రదర్శిస్తున్నాయి. ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంకు, కొటక్ బ్యాంక్, ఇన్ఫీ, సిప్లా టాప్ గెయినర్స్. టైటాన్, బీఈఎల్, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా టాప్ లూజర్స్. నిఫ్టీ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 26:24గా ఉంది.
News October 7, 2024
కరాచీ ఉగ్రదాడిలో ఇద్దరు చైనీయులు మృతి
పాకిస్థాన్ కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన <<14292979>>ఉగ్రదాడిలో<<>> ఇద్దరు చైనీయులు మరణించారు. ఈమేరకు పాక్లోని చైనా ఎంబసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు తొలుత దీన్ని ఆత్మాహుతి దాడిగా భావించినా, వాహనంలో పేలుడు పదార్థాలు పెట్టి పేల్చినట్లు తర్వాత అధికారులు గుర్తించారు. కాగా విదేశీయులే లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు ఇప్పటికే బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకున్న విషయం తెలిసిందే.