News June 17, 2024
19న పార్టీ నేతలతో YS జగన్ కీలక భేటీ

AP: అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీచేసిన అభ్యర్థులతో ఈ నెల 19న వైసీపీ అధినేత జగన్ కీలక భేటీ నిర్వహించనున్నారు. ఎంపీ అభ్యర్థులూ హాజరుకానున్నారు. రాజ్యసభ, లోక్సభ సభ్యులతో ఇప్పటికే సమావేశమైనందున వారికి మినహాయింపునిచ్చారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు సమావేశం జరగనుంది. ఎన్నికల్లో ఓటమి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది.
Similar News
News March 21, 2026
రాష్ట్రానికి కమర్షియల్ గ్యాస్ కోటా పెరిగింది: నాదెండ్ల

AP: రాష్ట్రానికి కమర్షియల్ గ్యాస్ కోటా పెరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 4,500 మెట్రిక్ టన్నుల కోటాను 5,200 మెట్రిక్ టన్నులకు కేంద్రం పెంచిందని వెల్లడించారు. పాఠశాలలు, కాలేజీలకు వేసవి సెలవులు వస్తుండటంతో అక్కడికి పంపే సిలిండర్లను హోటళ్లకు ఇస్తామని హోటల్స్ జేఏసీ బృందానికి హామీ ఇచ్చారు. మరోవైపు త్వరలోనే కిరోసిన్ను ప్రజలకు సరఫరా చేస్తామని పేర్కొన్నారు.
News March 21, 2026
ముస్లింల వస్తువులు వద్దన్నారు.. క్రూడాయిల్ ఎందుకు కొంటున్నారు: అసద్

TG: దేశంలోని పలు రాష్ట్రాల్లో ముస్లింలు తయారుచేసే వస్తువులు కొనవద్దని తీర్మానం చేసిన బీజేపీ అరబ్ దేశాల నుంచి క్రూడాయిల్ ఎందుకు కొనుగోలు చేస్తోందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ప్రధాని మోదీ విదేశాలకు వెళ్లి భారత్లో అన్ని వర్గాల కోసం పని చేస్తున్నామని చెప్తుండటం పచ్చి అబద్ధమన్నారు. దేశంలో గ్యాస్, పెట్రోలియం కొరత ఉన్నా అలాంటిదేం లేదని చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
News March 21, 2026
పెట్రోల్ ధరలు పెరుగుతాయా?

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశంలో LPG <<19316911>>గ్యాస్<<>>, పవర్ పెట్రోల్, ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెగ్యులర్ పెట్రోల్ విషయంలో ఆందోళన నెలకొంది. సాధారణ వాహన ఇంధన ధరలను <<19436412>>పెంచబోమని<<>> IOCL ప్రకటించింది. కానీ పలు రాష్ట్రాల ఎన్నికల తర్వాత రేట్లు పెరుగుతాయని తెలుస్తోంది. పెట్రోల్పై ₹10-15, డీజిల్పై ₹10 వరకు పెంచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


