News June 17, 2024
రూ.45వేల కోట్లతో ముంద్రా పోర్ట్ విస్తరణ!

గుజరాత్లోని ముంద్రా పోర్ట్ను విస్తరించేందుకు అదానీ పోర్ట్స్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రూ.45వేలకోట్లు వెచ్చించి పోర్టు సామర్థ్యాన్ని సంస్థ రెండింతలు చేయనుంది. 2025కి ముంద్రా పోర్టును 500 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను నిర్వహించగలిగే సామర్థ్యం గల పోర్టుగా తీర్చిదిద్దుతామని సంస్థ తెలిపింది. FY24లో అదానీకి చెందిన ముంద్రా పోర్టు దేశంలోని 27% కార్గోను హ్యాండిల్ చేసింది.
Similar News
News September 14, 2025
అద్భుతం.. జైపూర్ ఫుట్ తరహాలో ‘వైజాగ్ హ్యాండ్’

వైజాగ్లోని ఏపీ మెడిటెక్ జోన్ దివ్యాంగుల కోసం కృత్రిమ చేయిని అభివృద్ధి చేసింది. ప్రమాదాల్లో చేతులు కోల్పోయిన వారికి ఉపయోగపడేలా ‘వైజాగ్ హ్యాండ్’ పేరుతో దీనిని రూపొందించింది. ఇటీవల ఓ మహిళకు అమర్చగా ఆమె స్వయంగా పనులు చేసుకున్నారని సంస్థ ప్రతినిధులు తెలిపారు. జైపూర్ ఫుట్ తరహాలో చేతులు కోల్పోయిన వారికి ఇది సహకరిస్తుందని పేర్కొన్నారు. సోలార్ పవర్తో నడిచే వీల్చైర్లను కూడా తయారు చేస్తున్నామని చెప్పారు.
News September 14, 2025
ఇండియా-ఏ టీమ్ ప్రకటన.. అభిషేక్కు చోటు

ఆస్ట్రేలియా-ఏతో జరిగే మూడు వన్డేలకు ఇండియా-ఏ టీమ్ను BCCI ప్రకటించింది.
తొలి వన్డేకు(13 మంది): రజత్ పాటిదార్, ప్రభుసిమ్రన్, పరాగ్, బదోని, సూర్యాంశ్, విప్రజ్, నిశాంత్, గుర్జప్నీత్ సింగ్, యుధ్వీర్ సింగ్, రవి బిష్ణోయ్, అభిషేక్ పొరెల్, ప్రియాంశ్, సిమర్జిత్ సింగ్.
2, 3 వన్డేలకు(15 మంది): ప్రియాంశ్, సిమర్జిత్ స్థానంలో తిలక్, అభిషేక్తో పాటు హర్షిత్, అర్ష్దీప్కు చోటు దక్కింది.
పూర్తి వివరాలకు ఇక్కడ <
News September 14, 2025
కాంగ్రెస్ వల్లే విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి: హరీశ్ రావు

TG: రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడం సిగ్గుచేటని BRS MLA హరీశ్ రావు ఫైరయ్యారు. కాంగ్రెస్ నిర్లక్ష్యంతో విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి నెలకొందన్నారు. రీయింబర్స్మెంట్, ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా ప్రాజెక్టులకు ₹కోట్ల టెండర్లు ఎలా పిలుస్తున్నారని ప్రశ్నించారు. ఇలానే కొనసాగితే తక్కువ కాలంలో విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించిన విద్యాశాఖ మంత్రిగానూ రేవంత్ నిలిచిపోతారన్నారు.