News June 17, 2024
BJPకే స్పీకర్ పోస్ట్.. మిత్రపక్షాలకు డిప్యూటీ?

లోక్సభ స్పీకర్ పదవిని తమ పార్టీ వారికే కేటాయించాలని బీజేపీ నిర్ణయించినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. NDA కూటమిలోని మిత్రపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉందట. ఈ విషయంలో మిత్రపక్షాలను ఒప్పించే టాస్క్ కేంద్రమంత్రి రాజ్నాథ్సింగ్కు అప్పగించినట్లు తెలుస్తోంది. డిప్యూటీ పోస్టు టీడీపీ, జనతా దళ్ పార్టీల్లో ఎవరికి ఇస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.
Similar News
News September 14, 2025
రెండో కాన్పు తర్వాత చాలా ఇబ్బంది పడ్డా: ఇలియానా

రెండో ప్రసవం తర్వాత తాను ఎదుర్కొన్న ఇబ్బందులను హీరోయిన్ ఇలియానా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘రెండో బిడ్డ పుట్టినప్పుడు శారీరకంగా, మానసికంగా బలంగా ఉండాలి. ఆ సమయంలో పూర్తిగా గందరగోళంగా ఉంటుంది. నేను అది చాలా కష్టంగా ఫీలయ్యాను. మెంటల్ స్పేస్ పూర్తిగా లేకుండా పోయింది. ఆ సమయంలో నేను ముంబైలో లేను. అక్కడే ఉండుంటే నాకు సాయం చేసేందుకు ఫ్రెండ్స్ ఉండేవారు’ అని ఆమె చెప్పుకొచ్చారు.
News September 14, 2025
6 పరుగులకే 2 వికెట్లు

పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచులో భారత బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. హార్దిక్ పాండ్య తొలి బంతికే వికెట్ తీశారు. ఓపెనర్ అయుబ్(0) ఇచ్చిన క్యాచ్ను బుమ్రా ఒడిసి పట్టారు. బుమ్రా వేసిన రెండో ఓవర్ రెండో బంతికి హారిస్ (3) పాండ్యకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. ప్రస్తుతం పాకిస్థాన్ స్కోర్ 6/2.
News September 14, 2025
BREAKING: భారత్ ఓటమి

హాకీ ఆసియా కప్ ఫైనల్లో చైనా చేతిలో భారత మహిళల జట్టు ఓటమి పాలైంది. తుది పోరులో 4-1 గోల్స్ తేడాతో పరాజయం పాలైంది. దీంతో వరల్డ్కప్ ఆశలు ఆవిరయ్యాయి. తొలి నిమిషంలో నవనీత్ గోల్ కొట్టినా ఆ తర్వాత అమ్మాయిలు నెమ్మదించారు. అటు వరుస విరామాల్లో చైనా ప్లేయర్లు గోల్స్ కొట్టడంతో ఆసియా కప్-2025 విజేతగా నిలిచారు. చైనాకు ఇది మూడో టైటిల్.