News June 17, 2024
కరెంట్ షాక్ ఇచ్చి రేణుకాస్వామికి చిత్రహింసలు!

హీరో దర్శన్ అభిమాని రేణుకాస్వామి <<13434917>>హత్య<<>> కేసులో దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు ముందు అతడికి కరెంట్ షాక్ ఇచ్చి చిత్రహింసలు పెట్టినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. శాకాహారినని చెప్పినా వినకుండా బిర్యానీతోపాటు ఎముకను నోట్లో కుక్కి తినిపించారని తెలిసింది. బాధితుడి శరీరంపై 39 గాయాలుండగా, 8 చోట్ల కాలిన గుర్తులున్నాయట. రేణుకా స్వామిపై మొదట పవిత్రా గౌడనే దాడి చేసినట్లు తేలింది.
Similar News
News September 14, 2025
రెండో కాన్పు తర్వాత చాలా ఇబ్బంది పడ్డా: ఇలియానా

రెండో ప్రసవం తర్వాత తాను ఎదుర్కొన్న ఇబ్బందులను హీరోయిన్ ఇలియానా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘రెండో బిడ్డ పుట్టినప్పుడు శారీరకంగా, మానసికంగా బలంగా ఉండాలి. ఆ సమయంలో పూర్తిగా గందరగోళంగా ఉంటుంది. నేను అది చాలా కష్టంగా ఫీలయ్యాను. మెంటల్ స్పేస్ పూర్తిగా లేకుండా పోయింది. ఆ సమయంలో నేను ముంబైలో లేను. అక్కడే ఉండుంటే నాకు సాయం చేసేందుకు ఫ్రెండ్స్ ఉండేవారు’ అని ఆమె చెప్పుకొచ్చారు.
News September 14, 2025
6 పరుగులకే 2 వికెట్లు

పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచులో భారత బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. హార్దిక్ పాండ్య తొలి బంతికే వికెట్ తీశారు. ఓపెనర్ అయుబ్(0) ఇచ్చిన క్యాచ్ను బుమ్రా ఒడిసి పట్టారు. బుమ్రా వేసిన రెండో ఓవర్ రెండో బంతికి హారిస్ (3) పాండ్యకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. ప్రస్తుతం పాకిస్థాన్ స్కోర్ 6/2.
News September 14, 2025
BREAKING: భారత్ ఓటమి

హాకీ ఆసియా కప్ ఫైనల్లో చైనా చేతిలో భారత మహిళల జట్టు ఓటమి పాలైంది. తుది పోరులో 4-1 గోల్స్ తేడాతో పరాజయం పాలైంది. దీంతో వరల్డ్కప్ ఆశలు ఆవిరయ్యాయి. తొలి నిమిషంలో నవనీత్ గోల్ కొట్టినా ఆ తర్వాత అమ్మాయిలు నెమ్మదించారు. అటు వరుస విరామాల్లో చైనా ప్లేయర్లు గోల్స్ కొట్టడంతో ఆసియా కప్-2025 విజేతగా నిలిచారు. చైనాకు ఇది మూడో టైటిల్.