News June 17, 2024
ఈనెల 20న కరీంనగర్కి బండి సంజయ్

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్ ఈనెల 20న కరీంనగర్కి రానున్నట్లు బిజెపి నేతలు తెలిపారు. 21, 22వ తేదీల్లో కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గానికి ఒక ప్రముఖ దేవాలయం దర్శనం చేసుకుంటారని తెలిపారు. కేంద్ర మంత్రి హోదాలో మొదటి సారి కరీంనగర్కి రానున్న నేపథ్యంలో భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు బిజెపి నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News May 7, 2025
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం: కరీంనగర్ కలెక్టర్

ఇల్లందకుంట ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన శుక్రవారం సభకు కలెక్టర్ పమేలా సత్పతి హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకుంటే రోగాల బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. రూ.40 వేల విలువైన 54 రకాల వైద్య పరీక్షలను మహిళలకు ఉచితంగా అందిస్తున్నామని, తమ ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. 6 నెలలకు ఒక్కసారి ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేసుకోవాలని తెలిపారు.
News April 25, 2025
కరీంనగర్ జిల్లాలో 44.4°C డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు

కరీంనగర్ జిల్లాలో రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతుంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 44.4°C నమోదు కాగా, జమ్మికుంట 44.3, కరీంనగర్, మానకొండూర్ 44.2, రామడుగు 44.1, చిగురుమామిడి, చొప్పదండి, తిమ్మాపూర్ 43.9, కరీంనగర్ రూరల్ 43.6, గన్నేరువరం 43.4, శంకరపట్నం 43.3, కొత్తపల్లి 43.2, వీణవంక 42.9, ఇల్లందకుంట 42.5, హుజూరాబాద్ 42.1, సైదాపూర్ మండలంలో 41.7°Cగా నమోదైంది.
News April 25, 2025
కరీంనగర్ జిల్లాలో 44.4°C డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు

కరీంనగర్ జిల్లాలో రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతుంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 44.4°C నమోదు కాగా, జమ్మికుంట 44.3, కరీంనగర్, మానకొండూర్ 44.2, రామడుగు 44.1, చిగురుమామిడి, చొప్పదండి, తిమ్మాపూర్ 43.9, కరీంనగర్ రూరల్ 43.6, గన్నేరువరం 43.4, శంకరపట్నం 43.3, కొత్తపల్లి 43.2, వీణవంక 42.9, ఇల్లందకుంట 42.5, హుజూరాబాద్ 42.1, సైదాపూర్ మండలంలో 41.7°Cగా నమోదైంది.