News June 17, 2024
ఏఐతో సాఫ్ట్వేర్ రంగం నష్టపోదు: బిల్గేట్స్
ఏఐతో సాఫ్ట్వేర్ ఉద్యోగులు నష్టపోతారనే వాదనను మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తోసిపుచ్చారు. ఏఐ ఉన్నా సాఫ్ట్వేర్ ఉద్యోగుల అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో ఉద్యోగాలన్నిటినీ ఏఐ భర్తీ చేసే అవకాశం ఉన్నా 20ఏళ్లలో అది సాధ్యం కాదన్నారు. ఏఐతో ఉత్పాదకత మెరుగైందని.. భారత్, USలోని అనేక సక్సెస్ఫుల్ ప్రాజెక్టులు ఇందుకు నిదర్శనమని తెలిపారు. జెరోధా ఫౌండర్ నిఖిల్ కామత్తో పాడ్కాస్ట్లో ఈ వ్యాఖ్యలు చేశారు.
Similar News
News February 2, 2025
పంచాయతీ ఎన్నికలపై కీలక ప్రకటన
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ఖమ్మం జిల్లా వైరా పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 15లోపే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కాగా కులగణనపై ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక అందగా, ఈ నెల 4న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుని ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి తొలి వారంలో ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
News February 2, 2025
త్రిష తెలంగాణకు గర్వకారణం: రేవంత్
TG: అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ను గెలుచుకున్న భారత జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన త్రిషపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇలాంటి ప్లేయర్లు తెలంగాణకు గర్వకారణమని అన్నారు. మరింతగా రాణించి సీనియర్ జట్టులో స్థానం సంపాదించుకోవాలని ఆకాంక్షించారు. నైపుణ్యమున్న ప్లేయర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.
News February 2, 2025
భారత్ భారీ స్కోరు.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టీ20లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 247 పరుగులు నమోదు చేసింది. ఓపెనర్ అభిషేక్(135) సెంచరీతో చెలరేగారు. అభి తన ఇన్నింగ్సులో 13 సిక్సర్లు, 7 ఫోర్లు బాదారు. అతని హిట్టింగ్కు ఇంగ్లండ్ బౌలర్ల వద్ద సమాధానం లేకపోయింది. ఇంగ్లండ్ టార్గెట్ 248.