News June 17, 2024

గూగుల్ మ్యాప్స్‌‌ని నమ్మి.. UPSCకి 50మంది దూరం!

image

మహారాష్ట్రలోని సమర్థ్‌నగర్‌లో ఉన్న స్వామి వివేకానంద కాలేజీలో UPSC ఎగ్జామ్ సెంటర్‌ ఏర్పాటు చేశారు. అయితే ఆ సెంటర్ వడగావ్ కోహ్లటీలో ఉన్నట్లు గూగుల్ మ్యాప్స్ చూపించింది. మ్యాప్స్‌పై ఆధారపడ్డ 50మందికి పైగా అభ్యర్థులు మొదట వడగావ్ కోహ్లటీకి వెళ్లారు. తప్పుడు సెంటర్‌‌కి వచ్చామని గ్రహించి సమర్థ్‌నగర్‌కి చేరుకునే ప్రయత్నం చేసినా అప్పటికే ఎగ్జామ్ సెంటర్ గేట్లు మూసేశారు. దీంతో వారంతా పరీక్షకు దూరమయ్యారు.

Similar News

News March 26, 2026

‘వందేమాతరం’ తప్పనిసరి కాదు.. కానీ: SC

image

స్కూళ్లు, అధికారిక కార్యక్రమాల్లో ‘వందేమాతరం’ ఆలపించాలంటూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. జాతీయ గేయాన్ని పాడకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొనలేదని తెలిపింది. ఈ విషయంలో పిటిషనర్ మహమ్మద్ సయీద్ అనవసరంగా ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్యానించింది. దేశభక్తిపై బలవంతం చేయలేరని పిటిషనర్ తరఫు లాయర్ వాదించగా, జాతీయ గేయం విషయంలోనూ అలా చేయలేరా అని ప్రశ్నించింది.

News March 26, 2026

రేపు సెలవు

image

రేపు (శుక్రవారం) శ్రీరామనవమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలవు ఉండనుంది. ప్రభుత్వాలు రిలీజ్ చేసిన క్యాలెండర్ ప్రకారం శుక్రవారాన్ని పబ్లిక్ హాలిడేగా పేర్కొనడంతో స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉండనున్నాయి. అటు బ్యాంకులకు సైతం సెలవు ఉంది. 28న నాలుగో శనివారం, 29న ఆదివారం కాబట్టి వరుసగా 3 రోజులు బ్యాంకులు పని చేయవు. దీంతో ఈ రోజే బ్యాంకు పనులు పూర్తి చేసుకుంటే బెటర్.

News March 26, 2026

ఇరాన్‌పై విరుచుకుపడండి.. నెతన్యాహు ఆదేశం

image

అమెరికా-ఇరాన్ డీల్ పూర్తి కాక ముందే ఇరాన్‌పై విరుచుకుపడాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు IDF (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్)ను ఆదేశించారు. ఇరాన్ ఆయుధ ఇండస్ట్రీలను 48 గంటల్లో నాశనం చేయాలని బంకర్ నుంచి ఆదేశాలు జారీ చేసినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. కాగా ఇరాన్ నుంచి తమకు ఎప్పటికైనా ముప్పు తప్పదని ఇజ్రాయెల్ భావిస్తోంది.