News June 18, 2024

శ్రీకాకుళం: ప్రయాణికులకు APSRTC కీలక  సూచన 

image

శ్రీకాకుళం ఆర్టీసీ బస్సు ప్రయాణికులు తమ సందేహాలు, ఫిర్యాదులు, అభిప్రాయాలు, సూచనలు, సమాచారానికి APSRTC కాల్ సెంటర్ నంబర్ 149కి కాల్ చేయాలని అధికారులు తెలిపారు. ఈ మేరకు RTC అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి కాల్ చేస్తున్నట్లైతే 0866- 149 నంబరుకు డయల్ చేయాలని APSRTC అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Similar News

News February 25, 2026

SKLM: ‘డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందించండి’

image

డయేరియా బాధితులకు మరింత మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. జేమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న డయేరియా బాధితులను బుధవారం ఆయన పరామర్శించారు. వారికి అందిస్తున్న వైద్యం వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని అన్నారు.

News February 25, 2026

శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్‌పై వేటు

image

శ్రీకాకుళం నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ హెచ్. కూర్మారావుపై ప్రభుత్వం వేటు వేసింది. సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం డయేరియా ప్రధాన సమస్యగా మారింది. తాగునీటి సరఫరా, డయేరియా నిర్మూలనలో కమిషనర్ నిర్లక్ష్యంగా ఉన్నారని భావించి సస్పెండ్ చేశారు.

News February 25, 2026

శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షకు 737 మంది గైర్హాజరు

image

శ్రీకాకుళం జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షకు 737 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా ఆర్ఐఓ ఆర్.సురేశ్ తెలిపారు. బుధవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షకు మొత్తం 21,101 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 20,364 మంది హాజరైనట్లు ఆయన తెలిపారు. 96.51 హాజరు శాతం నమోదు అయిందని, ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని తెలిపారు.