News June 18, 2024

కర్నూలు: రైతుల అకౌంట్‌లోకి పీఎం కిసాన్ పెట్టుబడి సాయం

image

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఖరీప్ సీజన్ ప్రారంభం మే నెలలో కేంద్ర ప్రభుత్వం రైతులకు రూ.2వేల చొప్పున పెట్టుబడి సాయం చేయాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అది వాయిదా పడింది. కాగా ఆ పెట్టుబడి సాయం కేంద్ర ప్రభుత్వం ఇవాళ అందించనుంది. కర్నూలు జిల్లాలో 2.34లక్షల మంది రైతులకు రూ.46.97 కోట్లు, నంద్యాల జిల్లాలో 1.95లక్షల మంది రైతులకు రూ.39.19కోట్లు రైతుల అకౌంట్‌లోకి జమ కానుంది.

Similar News

News March 22, 2026

కర్నూలులో 23న ప్రజా ఫిర్యాదుల వేదిక: కలెక్టర్

image

ఈ నెల 23 (సోమవారం)న కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. జిల్లాలోని అన్ని మండల రెవెన్యూ, డివిజనల్, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అర్జీల స్థితి తెలుసుకోవడానికి 1100 కాల్ సెంటర్‌కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు నమోదు చేసుకోవచ్చని సూచించారు.

News March 22, 2026

కర్నూలు: ప్రమాదంలో 19 ఏళ్ల యువకుడి మృతి

image

గోనెగండ్ల మండలం వేముగోడులో మధ్యాహ్నం విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. రవిరెడ్డి పొలంలో కాంట్రాక్టర్ బావన్న నీళ్ల బావిని JCBతో తవ్వుతూ మట్టిని ట్రాక్టర్‌లో నింపుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో ట్రాక్టర్ ట్రాలీ, ఇంజన్‌కు మధ్య ఉన్న లింక్ తెగిపోయింది. దీంతో ట్రాక్టర్‌పై కూర్చున్న సాదిక్ బాషా(19) తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

News March 22, 2026

గ్యాస్‌కు ప్రత్యామ్నాయాలపై కలెక్టర్ దృష్టి

image

జిల్లాలో గ్యాస్ వినియోగాన్ని తగ్గించి ఇండక్షన్ స్టవ్‌లు, సోలార్, ఎలక్ట్రిక్ కుక్కర్లు వినియోగాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గ్యాస్ కొరత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ పరికరాల లభ్యత, ధరలు, సరఫరాపై పూర్తి వివరాలు సేకరించాలని సూచించారు. అవసరమైతే కిరోసిన్ స్టౌవ్‌ల డేటాను కూడా సిద్ధం చేయాలన్నారు. ప్రత్యామ్నాయ వంట పద్ధతులపై ప్రణాళిక అందించాలన్నారు.