News June 18, 2024
ఏఎన్ఎంల నియామకంపై తొలి సంతకం

రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి గుమ్మిడి సంధ్యారాణి గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం ఏఎన్ఎంల నియామకం ఫైల్పై తొలి సంతకం చేశారు. గిరిజనులకు డోలీ మోతలు తప్పిస్తానని, ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెస్తానన్నారు. మాతాశిశు మరణాలు నియంత్రణ చేస్తానని, కక్ష సాధించనని , త్రికరణ శుద్ధితో ప్రజల కోసం పని చేస్తానన్నారు.
Similar News
News March 8, 2026
VZM: రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష

విజయగరం జిల్లాలో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు.
➤VZM–సంబల్పూర్ 3వ లైన్ పనులకు వారంలో విత్డ్రావల్ ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశం ➤కొత్తవలస–VZM 4వ లైన్ పనులకు గెజిట్ నోటిఫికేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశం
➤ఖుర్దా రోడ్–VZM 3వ లైన్కు స్ట్రక్చర్ వ్యాల్యూయేషన్ రిపోర్టులు సిద్ధం చేయాలని ఆదేశం
➤జిల్లాలో మంజూరైన 17 ROB పనులపై ఆరా
News March 8, 2026
VZM: కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని 26 కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్త డా. ఎ. రామారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో కొత్త ప్రవేశాలు ఉండగా, 7 నుంచి 10, ఇంటర్లోని తరగతుల్లో ఖాళీ సీట్లు భర్తీ చేయనున్నామన్నారు. మార్చి 12 నుంచి ఏప్రిల్ 1 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
News March 8, 2026
పోలీస్ పరేడ్లో మహిళ దినోత్సవం: కలెక్టర్

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం 10 గంటలకు విజయనగరం పోలీస్ పరేడ్లో జిల్లా స్థాయి వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. జిల్లా పరిపాలన యంత్రాంగం, డీఆర్డీఏ, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, మెప్మా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలను సన్మానిస్తామన్నారు.


