News June 18, 2024
నాగిరెడ్డిపేట్లో వ్యక్తి గొంతు కోసిన దుండగులు
వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి గొంతు కోసిన ఘటన నాగిరెడ్డిపేటలో చోటుచేసుకుంది. మండలంలోని రాఘవపల్లికి చెందిన నాగయ్య(55) సోమవారం రాత్రి కాలకృత్యాలు తీర్చుకొని వస్తుండగా పోచమ్మ గుడి వద్ద గుర్తు తెలియని దుండగులు అతడిపై కత్తితో దాడి చేసి గొంతు కోసి పరారయ్యారు. అతడిని చికిత్స నిమిత్తం స్థానికులు ఎల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 10, 2025
బాల్కొండ: వరద కాలువలో వ్యక్తి గల్లంతు
బాల్కొండ మండలం బుస్సాపూర్ వద్ద ఇందిరమ్మ వరద కాలువలో పడి వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. వ్యక్తి ప్రమాదవశాత్తు వరద కాలువలో పడి పోవడంతో నీటి విడుదలను ప్రాజెక్టు అధికారులు నిలిపి వేశారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా మధ్యాహ్నం వరకు 2,500 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగింది.
News February 10, 2025
ఆర్మూర్ రానున్న త్రిపుర గవర్నర్
త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఆర్మూర్ పట్టణానికి రానున్నట్లు BJP సీనియర్ నాయకుడు లోక భూపతిరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన బాసరలో మహా జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకోనున్నారు. మామిడిపల్లిలోని వెంకటేశ్వర స్వామి వారిని, సిద్ధుల గుట్ట సిద్ధేశ్వరుడిని దర్శించుకొనున్నారు. BJP సీనియర్ నాయకులు భూపతి రెడ్డి స్వగృహానికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఇంటికి వెళ్లిన అనంతరం బాసరకు బయలుదేరుతారు.
News February 10, 2025
NZB: గత ప్రభుత్వంలో మొదలు పెట్టిన పనులను కొనసాగించాలి: కవిత
బీఆర్ఎస్ హయాంలో మొదలుపెట్టిన అభివృద్ధి పనులను కొనసాగించాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. కొండగట్టు ఆలయ అభివృద్ధిని ఆపవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు. బీఆర్ఎస్ హయాంలో మొదలుపెట్టిన అభివృద్ధి పనులను కొనసాగించాలని డిమాండ్ చేశారు. కొండగట్టు రోడ్డు అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.