News June 18, 2024

విజయవాడ: కన్సల్టెన్సీ పేరుతో మహిళ మోసం

image

సౌజన్య అనే మహిళ మరోవ్యక్తితో కలిసి విజయవాడలో ఓ కన్సల్టెన్సీ ద్వారా కొందరిని విజిటింగ్ వీసా ద్వారా కెనడా పంపించారు. అక్కడ సౌజన్యకు పార్ట్‌నర్‌తో విబేధాలు రాగా ఏలూరు రోడ్డులో సొంతంగా కన్సల్టెన్సీ ఓపెన్ చేసింది. విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తానని గుంటూరు, కృష్ణా, ఏలూరుకు చెందిన 40మంది నుంచి రూ.లక్షల్లో వసూలు చేసింది. బాధితులు విజయవాడ సీపీ రామకృష్ణను ఆశ్రయించగా ఆయన కేసును మాచవరం పోలీసులకు అప్పగించారు.

Similar News

News March 17, 2026

గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలి: కృష్ణా కలెక్టర్

image

జిల్లాలో గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణాలపై సంబంధిత అధికారులతో
మచిలీపట్నంలో ఆయన సమీక్షించారు. జిల్లాలో 20 రోజులుగా గృహ నిర్మాణ పనులు పురోగతి పరిశీలిస్తే 844 గృహాలు దశల వారి మార్పు జరిగాయన్నారు. వాటిలో 306 గృహాలు పైకప్పు స్థాయి నుంచి రూఫ్ క్యాస్ట్ స్థాయికి చేరుకున్నాయన్నారు.

News March 17, 2026

కృష్ణా: ఎండలు హీట్.. బొండాల ధరలు హాట్!

image

జిల్లాలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో శీతల పానీయాలకు భారీగా డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా డిహైడ్రేషన్ నుంచి ఉపశమనం కలిగించే కొబ్బరి బొండాలకు ప్రజలు అధికంగా మొగ్గు చూపుతున్నారు. దీంతో స్థానికంగా లభ్యత తగ్గిపోవడంతో పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల నుంచి కొబ్బరి బొండాలను కృష్ణా జిల్లాకు దిగుమతి చేస్తున్నారు. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా ఖర్చులు కూడా పెరగడంతో ధరలు స్వల్పంగా పెరిగాయి.

News March 17, 2026

సంక్షేమ వసతి గృహాలపై కృష్ణా కలెక్టర్ సమీక్ష

image

ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల మరమ్మతుల పురోగతిపై మచిలీపట్నంలో కలెక్టర్ డీకే బాలాజీ అధికారులతో సమీక్షించారు. 61 హాస్టళ్ల అభివృద్ధికి రూ.10.35 కోట్లు మంజూరు కాగా, రూ.5 కోట్లతో 46 హాస్టళ్లలో పనులు పూర్తయ్యాయన్నారు. తాగునీరు, ఆహార నాణ్యతపై రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.