News June 18, 2024
మార్కెట్లోకి ఇక్సిగో ఎంట్రీ.. 48.5% పెరిగిన షేర్ విలువ!
నేడు స్టాక్ మార్కెట్లోకి ఇక్సిగో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఐపీఓలో ఇష్యూ ప్రైస్ రూ.93/షేర్ కాగా ఇప్పుడు NSEలో 48.5% లాభంతో రూ.138.10కు లిస్టింగ్ అయింది. మరోవైపు బీఎస్ఈలో 45.16% పెరిగి షేర్ విలువ రూ.135 వద్ద కొనసాగుతోంది. ఈనెల 10-12 మధ్య జరిగిన ఐపీఓలో ఇన్వెస్టర్లు 98.34 రెట్లు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు ఇక్సిగో మాతృసంస్థ లీ ట్రావెన్యూస్ టెక్నాలజీ వెల్లడించింది.
Similar News
News October 7, 2024
Aiతో తెలుగు రాష్ట్రాల్లో 122M స్పామ్ కాల్స్ బ్లాక్: AIRTEL
స్పామ్ కాల్స్ను అరికట్టేందుకు Airtel నెట్వర్క్లో <<14250922>>ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్<<>>ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గత నెల 27 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ టెక్నాలజీతో వినియోగదారులకు స్పామ్ కాల్స్ బెడద గణనీయంగా తగ్గింది. ఈ పదిరోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఏకంగా 122 మిలియన్ల స్పామ్ కాల్స్, 2.3M మెసేజ్లను బ్లాక్ చేసినట్లు AIRTEL తెలిపింది. ఈ ఫీచర్ ప్రతీ యూజర్కు అందుబాటులో ఉందని పేర్కొంది.
News October 7, 2024
ఊరెళ్లే వారికోసం ప్రత్యేక బస్సులు: TGSRTC
దసరాకు ఊరెళ్లేవారికి TGSRTC గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేలా రాష్ట్రవ్యాప్తంగా 6304 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. రద్దీ నేపథ్యంలో ఈ నెల 9 నుంచి 12 తేదీ వరకు మరో 600 స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. రద్దీ ఎక్కువగా ఉందని వైట్ నంబర్ ప్లేట్ గల ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి ఇబ్బంది పడొద్దని, ఆర్టీసీలో సురక్షితంగా వెళ్లాలని సంస్థ ఎండీ సజ్జనార్ సూచించారు.
News October 7, 2024
మోదీతో ముగిసిన చంద్రబాబు భేటీ
ఢిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. విశాఖ స్టీల్ ప్లాంటును రక్షించేందుకు అవసరమైన చర్యలు, పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులు, విజయవాడలోని బుడమేరు వాగు ప్రక్షాళన, వరద నష్టంపై చర్చించినట్లు తెలుస్తోంది.