News June 18, 2024

HYD: మెట్రో ఎండీ NVS రెడ్డిని కలిసిన ఎంపీ రఘునందన్ రావు

image

హైదరాబాద్ మెట్రో రైల్ భవన్‌కి ఎంపీ రఘునందన్ ఈరోజు వచ్చారు. బేగంపేట్‌లోని మెట్రో స్టేషన్‌లో మెట్రో రైల్ ఎండీ NVS
రెడ్డిని ఎంపీ రఘునందన్ రావు కలిసి వినతిపత్రం అందజేశారు. మియాపూర్ నుంచి పటాన్‌చెరుకు, అక్కడి నుంచి సంగారెడ్డికి మెట్రో రైల్‌ను విస్తరించాలని మెట్రో రైలు ఎండీని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కోరారు. దీనికి ఎండీ NVS రెడ్డి సానుకూలంగా స్పందించారు.

Similar News

News October 4, 2024

HYD: మౌలానా ఆజాద్ యూనివర్సిటీలో అడ్మిషన్స్

image

మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. MA-Urdu,MA -Hindi,MA-English, BA,B com, సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నా యని చెప్పారు. వెబ్‌సైట్ http//manuadmission mion.samarth.edu.in దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 10 నవంబర్ 2024 వరకు అవకాశం ఉందని చెప్పారు.

News October 4, 2024

HYD: నేటి నుంచి పీసీసీ చీఫ్ జిల్లా పర్యటన

image

PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ శుక్రవారం నుంచి జిల్లా పర్యటనలకు సిద్ధం అవుతున్నారు. ఆయన సొంత జిల్లా నిజామాబాద్ నుంచే పర్యటన ప్రారంభించనున్న నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ నార్సింగిలోని తన ఇంటి నుంచి నిజామాబాద్ బయలుదేరుతారు. ఆయన వెంట ఎనిమిది మంది మంత్రులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీసీసీ సీనియర్ నేతలు ఉంటారని తెలిపారు.

News October 4, 2024

HYD: KTR.. SORRY చెప్పాలి: శ్రీనివాస్

image

మాజీ మంత్రి KTR వెంటనే మంత్రి కొండా సురేఖకు సారీ చెప్పాలని TPCC ప్రధాన కార్యదర్శి చెకోలేకర్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. HYD బషీర్‌బాగ్ చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ.. KTR తరచూ మహిళా ప్రజాప్రతినిధులను కించ పరుస్తున్నాడని మండిపడ్డారు. ఆయన తన BRS పార్టీ సోషల్ మీడియా ద్వారా కొండా సురేఖను ట్రోలింగ్ చేయిస్తున్నారని ఆరోపించారు. గతంలోనూ మంత్రి సీతక్కపై నోరు పారేసుకున్నారని ఫైర్ అయ్యారు.