News June 18, 2024
2500 ఏళ్ల క్రితం దారి మార్చుకున్న గంగానది!
సుమారు 2500 ఏళ్ల క్రితం వచ్చిన భూకంపం కారణంగా గంగానది తన ప్రవాహ దిశను మార్చుకుందని అమెరికా పరిశోధకులు తాజాగా అంచనా వేశారు. హిమాలయాల్లో ప్రారంభమయ్యే గంగ, భారత్, బంగ్లాదేశ్ మీదుగా బంగాళాఖాతంలో కలుస్తుంది. అయితే వేల ఏళ్ల క్రితం.. బంగ్లా ప్రస్తుత రాజధాని ఢాకా ప్రాంతానికి దక్షిణంగా సుమారు 100 కిమీ దూరంలో గంగమ్మ ప్రవహించేదని, భూకంపం అనంతరం ఇప్పుడున్న దిశలోకి మారిందని పరిశోధకులు వివరించారు.
Similar News
News February 3, 2025
డిగ్రీ అర్హత.. భారీ జీతంతో 1,000 ఉద్యోగాలు
ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1,000 క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 20వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. 60 శాతం మార్కులతో డిగ్రీ పాసై, 20-30 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్ బట్టి సడలింపు ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పే స్కేల్ నెలకు రూ.48,480-రూ.85,920 ఉంటుంది.
వెబ్సైట్: <
News February 3, 2025
అంగన్వాడీ పిల్లలకు మిల్క్, మిల్లెట్ స్నాక్స్!
TG: అంగన్వాడీలకు వచ్చే 3-5 ఏళ్ల పిల్లలకు మరింత క్వాలిటీ ఫుడ్ అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం వారికి ఒక పూట భోజనం, గుడ్డు, కుర్కురే స్నాక్స్ ఇస్తోంది. కుర్కురేకు బదులుగా ఓ గ్లాసు పాలు, మిల్లెట్స్తో చేసిన స్నాక్స్ ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. పిల్లలకు ఏ మిల్లెట్స్ మంచివి? వారికి సులభంగా జీర్ణమయ్యేలా ఎలా తయారుచేయాలి? అనే దానిపై నిపుణుల సలహాలు తీసుకోనుంది.
News February 3, 2025
చేనేత కార్మికులకు గుడ్ న్యూస్
TG: నేత కార్మికులకు ‘వర్కర్ టు ఓనర్’ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో నిర్మించిన వీవింగ్ షెడ్లలో పవర్ లూమ్స్ బిగించి లబ్ధిదారులకు ఇవ్వనుంది. త్వరలోనే అర్హులను గుర్తించి తొలుత సిరిసిల్ల జిల్లాలో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఒక యూనిట్ కింద ₹8L విలువైన 4 లూమ్స్ ఇస్తారు. యూనిట్ విలువలో 50% సబ్సిడీ, 40% బ్యాంక్ లోన్, 10% లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.