News June 18, 2024
విశాఖకు పునర్వైభవం తీసుకొస్తాం: పల్లా

AP: రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. దేశంలోనే నంబర్-1 ఆర్థిక రాజధానిగా విశాఖను చేసి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామన్నారు. క్యాపిటల్ పేరు చెప్పి వైజాగ్ను గంజాయికి రాజధానిగా మార్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని మండిపడ్డారు. గంజాయిని పూర్తిగా నిర్మూలించి విశాఖకు పునర్వైభవం తీసుకొస్తామని చెప్పారు.
Similar News
News March 16, 2026
టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం

ఏపీ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.30 గంటల లోపే విద్యార్థులు కేంద్రాలకు చేరుకున్నారు. ఆలస్యమైన స్టూడెంట్స్ను ప్రత్యేక పరిస్థితుల్లో 10 గంటలవరకు అనుమతిస్తున్నారు. మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరగనుంది.
News March 16, 2026
సిగరెట్, మద్యంతో మతిమరుపు!

వయసుతో సంబంధం లేకుండా కొన్ని అలవాట్లు మెదడు పరిమాణాన్ని తగ్గిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘నిద్రలేమి, ఒత్తిడి, ఊబకాయం, మధుమేహం, వ్యాయామం లేకపోవడం వల్ల మెదడు వేగంగా కుంచించుకుపోతుంది. విటమిన్ B12 లోపం, ఒంటరితనం, ధూమపానం, మద్యపానం వల్ల కూడా పరిమాణం తగ్గి మతిమరుపు వచ్చే ప్రమాదం ఉంది. సరైన నిద్ర, పౌష్టికాహారం, రోజూ వ్యాయామం చేసి మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు’ అని సూచిస్తున్నారు.
News March 16, 2026
స్టాక్ మార్కెట్లు ఇవాళ ఎలా ఉన్నాయంటే?

యుద్ధ ప్రభావం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు నెమ్మదిగా తేరుకుంటున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలు నిలిపివేసి పెట్టుబడులపై దృష్టి సారిస్తున్నారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ ఇవాళ ఫ్లాట్గా మొదలయ్యాయి. అల్ట్రాటెక్ సిమెంట్, JSW స్టీల్, హిందాల్కో, ITC, టాటా స్టీల్, అపోలో, కొటక్, సిప్లా, ఇండిగో షేర్లు లాభాల్లో ఉన్నాయి. బెల్, శ్రీరామ్ ఫైనాన్స్, ONGC, HAL, M&M, ట్రెంట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.


