News June 18, 2024
రూ.2,324 కోట్లతో ఐటీఐల ఆధునికీకరణ: CM రేవంత్

TG: రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లు(ATC)గా అప్గ్రేడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.2,324 కోట్లు ఖర్చు చేయన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు ఆయన శంకుస్థాపన చేశారు. కాగా పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చేందుకు 130 మంది నిపుణులను నియమించనున్నట్లు ప్రభుత్వం వర్గాలు తెలిపాయి.
Similar News
News September 15, 2025
నాగమల్లయ్య హత్యపై స్పందించిన ట్రంప్

అమెరికాలో భారతీయుడి <<17690207>>తల నరికివేసిన<<>> ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ‘క్యూబాకు చెందిన అక్రమ వలసదారు భార్యాబిడ్డల ముందే చంద్ర నాగమల్లయ్యను కిరాతకంగా చంపేశాడు. అతడు గతంలో నేరాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించాడు. అతడిని క్యూబా తమ దేశంలోకి తీసుకునేందుకు నిరాకరించింది. బైడెన్ అసమర్థతతో జైలు నుంచి బయటకు వచ్చాడు. నేరస్థుడిని కఠినంగా శిక్షిస్తాం. అక్రమ వలసదారులను వదలం’ అని హెచ్చరించారు.
News September 15, 2025
స్పీకర్కు అభ్యంతరాలు తెలపనున్న BRS నేతలు

TG: పార్టీ ఫిరాయింపుల నోటీసులకు ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై అభ్యంతరాలు తెలిపేందుకు బీఆర్ఎస్ నేతలు ఇవాళ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కలవనున్నారు. ఎమ్మెల్యేల వివరణపై అభ్యంతరాలుంటే మూడ్రోజుల్లోగా తెలపాలని సూచించిన విషయం తెలిసిందే. వాటిని పరిశీలించిన బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇవాళ మరిన్ని ఆధారాలు సమర్పించాలని నిర్ణయించింది. నోటీసులు అందుకున్న MLAల్లో కడియం శ్రీహరి, దానం నాగేందర్ వివరణ అందజేయాల్సి ఉంది.
News September 15, 2025
ఆర్బీఐలో 120 పోస్టులు

<