News June 18, 2024
రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైంది: భువనేశ్వరి

AP: రాష్ట్రంలో హింసాత్మక పాలన పోయి ప్రజాపాలన మొదలైందని CM చంద్రబాబు భార్య భువనేశ్వరి అన్నారు. ఎక్కడ చూసినా ప్రజలు తామే గెలిచామన్న సంతోషంలో ఉన్నారని ఆమె ఎక్స్లో ట్వీట్ చేశారు. ‘‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో ప్రజల ఆవేదన చూశా. వారి బాధలు విని, సమస్యలు తెలుసుకున్నా. కూటమి ప్రభుత్వం ప్రజలకు ప్రజాపాలన అందిస్తుంది. ఇకపై రాష్ట్ర ప్రజలకు అంతా మంచే జరుగుతుంది. ఆ నమ్మకం నాకుంది’ అని ఆమె పేర్కొన్నారు.
Similar News
News March 20, 2026
యుద్ధం కొనసాగితే LPG సప్లయ్ చైన్కు దెబ్బే: CBN

AP: ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం మరి కొన్నాళ్లు కొనసాగితే LPG గ్లోబల్ సప్లయ్ చైన్ దెబ్బతినే అవకాశం ఉందని CM CBN ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సంక్షోభాన్ని ఎదుర్కొనేలా సమర్ధవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు VCలో సూచించారు. ఇండక్షన్ స్టవ్లు, PNG వంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎరువులు, పెట్రోల్, డీజిల్కు లోటు రానివ్వకుండా కేంద్రంతో సంప్రదింపులు జరపాలన్నారు.
News March 20, 2026
‘పిరికిపందలు’.. నాటో దేశాలపై ట్రంప్ ఫైర్!

ఇరాన్పై పోరులో నాటో దేశాలు భాగం కాకపోవడంపై US అధ్యక్షుడు ట్రంప్ మరోసారి విమర్శలు గుప్పించారు. US లేకపోతే నాటో ఎందుకూ పనికిరాదని విమర్శించారు. ఆయిల్ ధరలపై ఆ దేశాలు ఫిర్యాదు చేస్తున్నాయి కానీ హార్ముజ్ను క్లియర్ చేసేందుకు మాత్రం సహాయపడట్లేదన్నారు. హార్ముజ్ను క్లియర్ చేయడం ఆ దేశాలకు సులువైన పనేనని అన్నారు. ఈ వైఖరిని గుర్తుపెట్టుకుంటానన్న ట్రంప్.. నాటో దేశాలను పిరికిపందలుగా అభివర్ణించారు.
News March 20, 2026
వ్యాధులను ముందే పసిగట్టే డివైజ్లు

క్యాన్సర్ సహా అన్ని వ్యాధులను ముందుగానే గుర్తించేందుకు నెక్ట్స్ జనరేషన్ ఫ్లెక్సిబుల్ సెమీ కండక్టర్ డివైజ్లను IIT జోధ్పుర్ సైంటిస్టులు అభివృద్ధి చేస్తున్నారు. ఇవి శరీరం నుంచి వెలువడే బయో కెమికల్స్, కండరాల కదలిక, బాడీ టెంపరేచర్, హార్ట్ రేట్ను నిత్యం పర్యవేక్షిస్తాయి. ఏవైనా తేడాలు గుర్తించగానే సిగ్నల్ ఇస్తాయి. వీటిని యూనిఫామ్స్ లేదా ప్రత్యేక ప్యాచ్లలో ఎక్కువసేపు ధరించినా ఇబ్బంది ఉండదు.


