News June 18, 2024
రాయితీపై టమాటా సరఫరా: మార్కెటింగ్ శాఖ

AP: రాష్ట్రవ్యాప్తంగా టమాటా ధరలు భారీగా పెరగడంతో వినియోగదారులకు రాయితీతో అందించాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. రేట్లపై ఉన్నతాధికారులు ఇవాళ సమీక్ష నిర్వహించారు. రిటైల్ మార్కెట్లో సగటున కిలో <<13456744>>ధర<<>> రూ.55-65 పలుకుతున్నట్లు గుర్తించారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా చిత్తూరు జిల్లాలోని మార్కెట్ల ద్వారా కొనుగోలు చేసి, రైతు బజార్లలో అదే ధరకు విక్రయించనున్నట్లు తెలిపారు. అయితే ఏ రేటుకు అనేది వెల్లడించలేదు.
Similar News
News September 15, 2025
KMR: అత్యధిక వర్షపాతం ఎక్కడంటే!

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా అత్యధిక వర్షపాతం వివరాలు.. సోమూరు 108మి.మీ, మేనూరు 89.5, డోంగ్లి 89.3, వెల్పుగొండ 42.8, తాడ్వాయి 42.5, లచ్చపేట 40, బొమ్మన్ దేవిపల్లి 39.5, బీబీపేట 28.3, భిక్కనూర్ 27, బీర్కూర్ 16.5, బిచ్కుంద 16.3, ఇసాయిపేట 14.3, పాత రాజంపేట 14, మాక్దూంపూర్ 12.3,సర్వాపూర్ 12, దోమకొండ 11.8మి.మీ లుగా నమోదయ్యాయి.
News September 15, 2025
నేడు స్థానిక ఎన్నికలపై సీఎం సమావేశం

TG: స్థానిక సంస్థల ఎన్నికలపై ఇవాళ సీఎం రేవంత్ మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సీతక్క, పొంగులేటి, పొన్నం, ఉత్తమ్ పాల్గొననున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాత రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అటు హైకోర్టు గడువు ఈ నెలాఖరుతో ముగియనున్నందున ప్రభుత్వం అప్పీల్కు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
News September 15, 2025
పవర్గ్రిడ్లో 866 అప్రంటిస్లు.. AP, TGలో ఎన్నంటే?

పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 866 అప్రంటిస్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రికల్, సివిల్, రాజ్భాష, ఎగ్జిక్యూటివ్ లా విభాగాల్లో APలో 34, TGలో 37 ఖాళీలు ఉన్నాయి. పోస్టులను బట్టి ITI, డిప్లొమా, డిగ్రీ, PG చేసి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. పోస్టును అనుసరించి స్టైపెండ్ రూ.13,000 నుంచి రూ.17,500 వరకు ఉంటుంది. అక్టోబర్ 6లోగా powergrid.in సైట్లో అప్లై చేసుకోవచ్చు.