News June 18, 2024
దివ్యదర్శనం టోకెన్ల స్కానింగ్ ప్రారంభించండి: టీటీడీ ఈవో

TTD ఈవో జే.శ్యామలారావు అధికారులకు కీలక సూచనలు చేశారు. కాలినడక భక్తులకు 1200వ మెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్ల స్కానింగ్ ప్రారంభించాలని ఆదేశించారు. APSRTC, టూరిజం కోటా దర్శన టికెట్లు నిరుపయోగం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు కచ్చితమైన దర్శన సమయాలు తెలిసేలా నారాయణగిరి షెడ్ల వద్ద ఎలక్ట్రానిక్ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తుల రద్దీ నియంత్రణకు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు.
Similar News
News January 3, 2026
నేడు ఉల్లి రైతుల ఖాతాల్లోకి డబ్బులు

AP: ప్రకృతి వైపరీత్యాలు, ధరల పతనంతో నష్టపోయిన ఉల్లి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. ఖరీఫ్లో ఉల్లి సంక్షోభాన్ని ప్రభుత్వం గుర్తించిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కర్నూలు, కడప జిల్లాలకు చెందిన 37,752 మంది రైతుల అకౌంట్లలో రూ.128.33 కోట్లను ఈరోజు జమ చేయనున్నారు. కర్నూల్ జిల్లాల్లోనే 31,352 మంది ఖాతాల్లో రూ.99.92కోట్లు జమ కానున్నట్లు పేర్కొన్నారు.
News January 3, 2026
వంటింటి చిట్కాలు

* బియ్యం కడిగిన నీటిలో కోడిగుడ్లను ఉడకబెడితే పెంకులు సులువుగా వస్తాయి.
* కూరల్లో పులుపు తక్కువయితే మామిడి పొడితో పెరుగును కలిపి కూరలో వేస్తే టమాటా రుచి వస్తుంది.
* ఆలూ పరాటా చేసేటప్పుడు ఉడికించిన బంగాళదుంపలను కాసేపు ఫ్రిజ్లో పెట్టి, చల్లారిన తర్వాత పరోటా చేస్తే జిగటగా లేకుండా చక్కగా వస్తాయి.
* సేమ్యా హల్వా రుచిగా రావాలంటే చెంచా సెనగపిండి కలిపితే సరిపోతుంది.
News January 3, 2026
కొత్తగా రైల్వన్ యాప్.. పాత సీజన్ పాస్, వ్యాలెట్ల పరిస్థితేంటి?

UTS(అన్రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్) యాప్లో లోకల్ రైళ్ల నెలవారీ పాస్ను బుక్ చేసుకునే సౌకర్యాన్ని రైల్వే నిలిపేసింది. రైల్వన్ యాప్ ఉపయోగించాలని చెప్పింది. దీంతో ప్రస్తుత సీజన్ పాస్, R-వ్యాలెట్ బ్యాలెన్స్ ఏమవుతాయోనని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ‘ఇప్పటికే తీసుకున్న పాస్లు గడువు ముగిసేదాకా చెల్లుతాయి. UTSలో ఇకపైనా జనరల్, ప్లాట్ఫామ్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు’ అని రైల్వే క్లారిటీ ఇచ్చింది.


