News June 18, 2024
జూ.కాలేజీ విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, బ్యాగ్

AP: ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందుతున్నాయి. ఇకపై వాటితోపాటు నోట్ పుస్తకాలు, బ్యాగ్లనూ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. KGBVలు, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలలు, హైస్కూల్ ప్లస్లలో చదివే స్టూడెంట్లకూ తెలుగు అకాడమీ ద్వారా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ పథకానికి నోడల్ అధికారిగా సమగ్ర శిక్ష డైరెక్టర్ను నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది.
Similar News
News March 29, 2026
స్వార్థపూరిత రాజకీయాలు చేయొద్దు: మోదీ

గతంలో కొవిడ్, ప్రస్తుతం యుద్ధాలతో ప్రపంచం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని ప్రధాని మోదీ చెప్పారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సంక్షోభం తలెత్తిందని 132వ మన్కీబాత్లో తెలిపారు. ఈ సమయంలో దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగేలా తప్పుడు ప్రచారాలు, స్వార్థపూరిత రాజకీయాలు చేయొద్దని విపక్షాలకు హితవు పలికారు. ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని, ఐక్యంగా ఉండాలని ప్రజలకు మరోసారి సూచించారు.
News March 29, 2026
హైదరాబాద్ను మించిన రాజధానిగా అమరావతి: CBN

AP: స్థానిక సంస్థల్లో మహిళలకు ఏనాడో రిజర్వేషన్లు కల్పించిన పార్టీ టీడీపీ అని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ‘సామాన్యులను చట్టసభలకు పంపిన పార్టీ టీడీపీ. మేం తెచ్చిన విద్యుత్ సంస్కరణలు అనేక రాష్ట్రాలకు మోడల్గా మారాయి. ఇక మూడు రాజధానుల మూడు ముక్కలాటలు ఉండవు. హైదరాబాద్ను మించిన రాజధానిగా అమరావతి మారుతుంది’ అని తెలిపారు.
News March 29, 2026
కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలి.. అసెంబ్లీలో డిమాండ్!

TG: అసెంబ్లీలో కడియం శ్రీహరి పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనుచితంగా ప్రవర్తించారని మంత్రులు, అధికార పక్ష ఎమ్మెల్యేలు ఆరోపించారు. కడియం మాట్లాడుతుండగా కౌశిక్ గన్తో కాల్చి పడేస్తానంటూ చేయితో సైగలు చేశారని మండిపడ్డారు. ఆయన్ను ఎమ్మెల్యేగా బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దళితుల పట్ల బీఆర్ఎస్ అగౌరవంగా వ్యవహరిస్తోందని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.


