News June 18, 2024
ఏలూరు: కదులుతున్న రైలు నుంచి పడి దుర్మరణం

ఏలూరు జిల్లా భీమడోలు మండలంలోని పాతూరు రైల్వే గేట్ సమీపంలో మంగళవారం కదులుతున్న రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్ఐ నరసింహారావు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడు బిహార్ రాష్ట్రానికి చెందిన సుజన్ మహాల్దార్(24)గా గుర్తించామన్నారు. డెడ్బాడీని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరిచి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Similar News
News November 8, 2025
పాలకొల్లు: నీళ్లనుకుని కలుపుమందు తాగి వ్యక్తి మృతి

పాలకొల్లు బ్రాడీపేటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ పాలూరి రమేశ్ (46) మృతి చెందాడు. ఈ నెల 4న విధులకు వెళ్తూ పొరపాటున మంచినీళ్ల సీసాకు బదులు కలుపుమందు సీసాను తీసుకెళ్లారు. మార్గమధ్యంలో నీళ్లు అనుకుని దానిని తాగడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. స్థానికుల సమాచారంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఆయన మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు.
News November 8, 2025
నరసాపురం: ఉరి వేసుకుని వ్యక్తి మృతి

నరసాపురం(M) సీతారామపురంలోని 216 జాతీయ రహదారి బ్రిడ్జి వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. మృతుడిని సీతారామపురం నార్త్ గ్రామానికి చెందిన వాకా సత్యనారాయణ (72)గా గుర్తించారు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 8, 2025
భీమవరం: బ్యాంకుల అధికారులపై కలెక్టర్ అసహనం

పీఎం స్వనిధి, వీవర్స్ ముద్ర, ఎస్హెచ్సి గ్రూపులకు బ్యాంకర్లు వెంటనే రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. శుక్రవారం భీమవరం క్యాంపు కార్యాలయం నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా బ్యాంకర్లు, అధికారులతో ఆమె సమీక్షించారు. పీఎం స్వనిధి కింద నిధులు విడుదలలో కొన్ని బ్యాంకులు తాత్సారం చేయడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ, వేగవంతంగా రుణాలు అందించాలని సూచించారు.


