News June 19, 2024

అభిషేక్, నితీశ్‌కు బంపరాఫర్?

image

SRH ఆటగాళ్లు అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డికి BCCI బంపరాఫర్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. జులైలో జరిగే జింబాబ్వే పర్యటనకు వీరిని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. వీరితోపాటు హర్షిత్ రాణా, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, విజయ్ కుమార్, యశ్ దయాల్‌ను సెలెక్ట్ చేయనున్నట్లు టాక్. అలాగే రింకూ సింగ్, గిల్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్‌లకూ స్థానం దక్కనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అనౌన్స్‌మెంట్ రానుంది.

Similar News

News March 20, 2026

రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్షసూచన

image

AP: పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది. మరికాసేపట్లో కృష్ణా జిల్లాలో వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. ఇప్పటికే ఆ జిల్లాలో కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంది. మరో 2 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే.

News March 20, 2026

వెయిట్ లాస్ మందుల ధర తగ్గించిన నాట్కో

image

అధిక బరువుతో బాధపడేవారికి NATCO గుడ్ న్యూస్ చెప్పింది. నోవో నార్డిస్క్ పేటెంట్ గడువు ముగియడంతో సెమాగ్లుటైడ్ జెనరిక్ వెర్షన్‌ను అత్యంత చౌకగా మార్కెట్లోకి తెచ్చింది. SEMANATTM, SEMAFULLTM బ్రాండ్ల పేరుతో లభించే మల్టీ-డోస్ వయల్స్ ధరను కేవలం ₹1,290గా నిర్ణయించింది. ఇది అసలు బ్రాండ్ ధర కంటే దాదాపు 90% తక్కువ కావడం విశేషం. ఏప్రిల్‌లో పెన్ డివైజ్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి.

News March 20, 2026

ఉద్యోగులకు డిజిటల్ హెల్త్ కార్డులు

image

TG: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని(EHS) ప్రారంభిస్తున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో భట్టి విక్రమార్క ప్రకటించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు 421 ఎంప్యానెల్ ప్రైవేటు హాస్పిటల్స్‌లో 1,998 వ్యాధులకు చికిత్స పొందవచ్చని తెలిపారు. ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డు అందిస్తామన్నారు.