News June 19, 2024

ఈ నెల 21న శ్రీనగర్‌‌కు మోదీ: కేంద్ర మంత్రి

image

ఈ నెల 21న ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీనగర్‌లో జరిగే కార్యక్రమంలో 9వేల మందితో కలిసి యోగా చేస్తారని మీడియాకు తెలిపారు. 20 జిల్లాల నుంచి 2వేల మంది చొప్పున వర్చువల్‌గా పాల్గొనేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది జమ్మూకశ్మీర్‌వ్యాప్తంగా మంచి ప్రభావం చూపిస్తుందని ఆకాంక్షించారు.

Similar News

News February 3, 2026

రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే..

image

రోజూ రాత్రి నిద్రపోయే ముందు ఓ లవంగం మొగ్గను నమిలితే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు. ఒత్తిడి తగ్గి మంచి నిద్ర వస్తుందని పేర్కొంటున్నారు. అలాగే రాత్రి భోజనానికి అరగంట ముందు గోరు వెచ్చని నీరు తాగితే ఆహారం సులభంగా అరుగుతుందని చెబుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ టీ, కాఫీ లాంటివి తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.

News February 3, 2026

జల్‌జీవన్ మిషన్‌ నిధులు నిలిపివేత

image

జల్‌జీవన్ మిషన్లో మిగిలిన పనులకు నిధులు నిలిపివేస్తున్నట్లు కేంద్రం రాజ్యసభలో ప్రకటించింది. 2019లో చేపట్టిన ఈ స్కీమ్‌లో ₹2.08 ల‌క్ష‌ల CR 2024-25కే ఖర్చయి 81.5% పనులే పూర్తయ్యాయి. పలు రాష్ట్రాల్లో అక్రమాలు గుర్తించిన కేంద్రం మిగతా పనులకు నిధులు రాష్ట్రాలే భరించాలని స్పష్టం చేసింది. FY26-27కు కేటాయించిన ₹67,670 CR నిర్వహణకు ఇవ్వనుంది. కాగా APలో రూ.23వేల కోట్ల పనులకు ఇటీవలే కేంద్రం ఆమోదం తెలిపింది.

News February 3, 2026

13న ఓటీటీలోకి రవితేజ సినిమా?

image

రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయినట్లు సమాచారం. ఈ నెల 13 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ట్రయాంగిల్ లవ్&కామెడీ డ్రామాతో రూపొందిన ఈ చిత్రంలో డింపుల్ హయాతి, ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. జనవరి 13న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది.