News June 19, 2024
కడప: బస్సు హెల్పర్ పై దాడి.. ముగ్గురు అరెస్టు
కడప నగరంలోని వన్టౌన్ పరిధిలో ఆర్టీసీ పాత అసుపత్రి ఆవరణంలో డిసెంబర్ 30న హెల్పర్ ప్రసాద్పై, రవి కుమార్, కిషోర్కుమార్, మరో 5మందితో కలిసి దాడి చేసిన సంఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సీఐ భాస్కర్రెడ్డి తెలిపారు. ఈ ఘటనలో అరెస్టయిన వారిలో రవికుమార్, ప్రశాంత్, మునీంద్ర ఉన్నారు. ఈ ప్లేస్లో మరి కొంతమంది పరార్లో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు.
Similar News
News October 4, 2024
కమలాపురం: భూ తగాదాల్లో తోపులాట.. వ్యక్తి మృతి
కమలాపురం మండల పరిధిలోని అప్పారావుపల్లెలో భూ తగాదాల కారణంగా ఇరు వర్గాల మధ్య గురువారం రాత్రి ఘర్షణ జరిగింది. ఈ తోపులాటలో శీలం కృష్ణారెడ్డి (65) మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. బావా బామర్దుల మధ్య భూమి విషయంలో జరిగిన వాదనలు తోపులాటకు దారితీశాయి. ఈ సందర్భంలో కృష్ణారెడ్డికి ఒక్కసారిగా చాతినొప్పి రావడంతో కిందపడ్డారు. వెంటనే కమలాపురం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
News October 4, 2024
కడప: కుడా వైస్ ఛైర్మన్గా అదితి సింగ్
కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) వైస్ ఛైర్మన్గా ప్రస్తుత కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ను నియమిస్తూ.. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదివరకు వైస్ ఛైర్మన్గా ఉన్న వైఓ నందన్ సీడీఎంఏ డీడీగా బదిలీ అయిన నేపథ్యంలో ప్రభుత్వం జేసీకి ఇన్ఛార్జి వైస్ ఛైర్మన్ బాధ్యతలను అప్పగించారు.
News October 4, 2024
కడప: ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో నేరుగా అడ్మిషన్లు
వైవీయూ పీజీ కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో నేరుగా ప్రవేశాలు (ఏ.పి.ఐ.సి.ఈ.టి-2024) కల్పిస్తున్నట్లు విశ్వవిద్యాలయ ప్రవేశాల సంచాలకులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు విశ్వవిద్యాలయంలోని ఏపీజే అబ్దుల్ కలాం గ్రంథాలయ ప్రాంగణంలోని డీఓఏ కార్యాలయంలో ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు జరిగే కౌన్సెలింగ్కు హాజరు కావాలన్నారు. విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రుసుంతో రావాలన్నారు.