News June 19, 2024
జనగాం: ఇద్దరు డిగ్రీ విద్యార్థులు డిబార్
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సుల పరీక్షలు జరుగుతున్నాయి. జనగామ ఏబీవీ డిగ్రీ కళాశాలలో ఇద్దరు వ్యక్తులు ఒకరికి బదులుగా మరొకరు పరీక్షలు రాస్తుండగా తనిఖీ అధికారులు డిబార్ చేసినట్లుగా పరీక్షలు నియంత్రణ అధికారి ప్రొఫెసర్ శ్రీ రామోజు నరసింహచారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ నరేందర్లు తెలిపారు. వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Similar News
News October 7, 2024
ఉమ్మడి వరంగల్ జిల్లాలో టాప్ న్యూస్..
> MHBD: దక్షిణాఫ్రికాలో మెరిసిన జిల్లా అమ్మాయి
> MLG: ఆత్మ రక్షణ కోసం కరాటే నేర్చుకోవాలి
> WGL: కరెన్సీ నోట్లతో మహాలక్ష్మి అలంకరణలో అమ్మవారు
> JN: ఒకే ఇంటిలో ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు
> HNK: జిల్లాలో ఘనంగా దాండియా వేడుకలు
> BHPL: పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది: MLA
> HNK: వృద్ధులను చిన్న పిల్లల్లా చూసుకోవాలి: ఎంపీ
News October 7, 2024
ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..
> MHBD: పిడుగు పాటుకు గేదే మృతి.
> JN: మద్యం తాగి వాహనాలు నడుపరాదు
> MLG: సారా తరలిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు
> WGL: పర్వతగిరిలో టపాసులు సీజ్
> HNK: పిడుగుపాటుకు ఇద్దరూ మృతి
> NSPT: కూలిన భారీ స్వాగత ఆర్చులు
> MLG: ట్రాక్టర్ బోల్తా పడి రైతూ మృతి
> WGL: తాటి చెట్టుపై నుండి పడి గీత కార్మికుడికి గాయాలు
News October 6, 2024
దక్షిణాఫ్రికాలో మెరిసిన మహబూబాబాద్ అమ్మాయి
దక్షిణాఫ్రికాలో జరిగిన అంతర్జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్లో ఇండియా తరఫున 76 కేజీల విభాగంలో మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలానికి చెందిన సుకన్య రజతం సాధించింది. జాతీయ స్థాయిలో పతకం గెలవడంతో జిల్లాలో ప్రజలు అనందం వ్యక్తం చేస్తున్నారు. తన సొంత గ్రామంలో సంబురాలు అంబారాన్నంటాయి. అంతర్జాతీయ స్థాయిలో రాణించడం గర్వకారణమని తెలుగునాట ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.