News June 19, 2024

శ్రీకాకుళం: 24 నుంచి ఏపీ ఆర్ సెట్ ముఖాముఖి

image

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పీహెచ్డీ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన ఏపీ ఆర్ సెట్ ప్రవేశాలకు గాను ముఖాముఖి ఈనెల 24 నుంచి ప్రారంభంకానున్నట్లు సెట్ కన్వీనర్ దేవప్రసాద్ రాజు మంగళవారం తెలిపారు. రాష్ట్రంలో 12 విద్యాలయాల్లో ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు సబ్జెక్టులు వారీగా ముఖాముఖి ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు. https://cets apsche.ap.gov.in వెబ్ సైట్లో వివరాలు పొందుపరిచామన్నారు.

Similar News

News March 2, 2026

వికసిత్ భారత్ లక్ష్యాలు ఇంటింటికీ చేరాలి: కలెక్టర్

image

కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ‘వికసిత్ భారత్’ లక్ష్యాలు ప్రతి గడపకు చేరాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో నూతనంగా చేపడుతున్న ‘వీబీజీ రాంజీ’ కార్యక్రమ గోడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పు వంటి కీలక నిర్ణయాలను వివరించారు. ఈ లక్ష్యాల సాధనలో అధికారులు చురుగ్గా పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

News March 2, 2026

శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్‌కు 56 అర్జీలు

image

శ్రీకాకుళం ఎస్పీ కార్యలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమానికి 56 ఫిర్యాదులు వచ్చాయి. వీటి పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. తన దృష్టికి వచ్చిన అర్జీలపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నామని చెప్పారు. వారితో ముఖాముఖి మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.

News March 2, 2026

SKLM: ‘జాతీయ లోక్ అదాలత్ వినియోగించుకోవాలి’

image

మార్చి 14న జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. సోమవారం జిల్లా కోర్టు ఆవరణలో డీఎల్‌ఎస్‌ఏ కార్యాలయంలో బ్యాంక్ అధికారులు ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. అధికంగా రాజీలు చేయించేందుకు అధికారులు ప్రయత్నం చేయాలన్నారు.